తిరుమల శ్రీవారి కోసం రిలయన్స్ భారీ విరాళం.. ఏకంగా వందల కోట్లు, భక్తుల కోసం

Wait 5 sec.

తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. టీటీడీ భక్తుల కోసం ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ ద్వారా ఉచితంగా అన్నప్రసాదం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే టీటీడీ అన్న ప్రసాదం పంపిణీకి సంబందించి కీలక నిర్ణయం తీసుకుంది. అన్నప్రసాదానికి సంబంధించి హైటెక్‌ హంగులు అద్దుతోంది. అన్నప్రసాదాన్ని పూర్తిగా ఆటోమేషన్‌ విధానంలో అత్యాధునిక వంటశాల, డైనింగ్‌ బ్లాక్‌ను నిర్మించడానికి లైన్ క్లియర్ అయ్యింది. ఈ మేరకు అన్నప్రసాదానికి సంబంధించి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఏకంగా రూ.120 కోట్ల విరాళంతో ప్రాజెక్టును చేపట్టనుందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి టీటీడీ రిలయన్స్‌తో ఎంవోయూ చేసుకోనుంది. ఇటీవల సమావేశంలో ఆమోదం కూడా తెలిపారు. తర్వాత ఈ ప్రాజెక్టుపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన చేశారు. రిలయన్స్ సంస్థ సహకారంతో రూ.120 కోట్లతో అధునాతన అన్నదాన సముదాయన్ని నిర్మిస్తామన్నారు. తిరుమలలో వంటశాల నిర్వహణను ఆటోమేషన్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అందుకు తగిన విధంగా తిరుమలలోని అన్న ప్రసాద కాంప్లెక్స్‌ సమీపంలోని అల్లమ్మ తోట (గ్యాస్‌ ప్లాంట్‌ ఉన్న ప్రదేశం)ను కొత్త వంటశాల నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందని టీటీడీ అధికారులు గుర్తించారు. ఈ వంటశాల నిర్మాణం పూర్తయ్యాక టీటీడీకి అప్పగించడంతో పాటు, నిర్వహణపై రిలయన్స్‌ ఏజెన్సీ టీటీడీ సిబ్బందికి అవసరమైన నైపుణ్య శిక్షణను అందిస్తుంది.టీటీడీ జేఈవో తనిఖీలుఎస్పీడబ్ల్యూ మహిళా జూనియర్ కళాశాలలో అత్యవసరమైన పనులను సకాలంలో పూర్తి చేయాలని టిటిడి జేఈవో ( విద్య ఆరోగ్యం) డా. ఏ శరత్ అధికారులను ఆదేశించారు. మహిళా జూనియర్ కళాశాలను సోమవారం సాయంత్రం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. మహిళా జూనియర్ కళాశాలలో విద్యార్థినుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని, విద్యార్థినులు ప్రాథమిక అవసరాలను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు జేఈవో సూచించారు. శాశ్వత ప్రాతిపతికన చేయాల్సిన పనులను గుర్తించి ప్రారంభ ప్రక్రియను చేపట్టాలన్నారు. కళాశాలలో 2000 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారని, 97% ఉత్తీర్ణత సాధిస్తున్నారని ఆయన తెలిపారు. విద్యార్థినులు చదువుకునేందుకు కళాశాల పరిసరాలు చాలా బాగున్నాయన్నారు. ముఖ్యంగా కళాశాలలో విద్యార్థినులకు హాస్టల్ సామర్థ్యాన్ని, వసతి సౌకర్యాన్ని పెంచాలని, వైద్య సౌకర్యాల పెంపు, వేడి నీటి కోసం సోలార్ వాటర్ హీటర్స్, ఈ – లెర్నింగ్ సెమినార్ హాల్ ఏర్పాటు, హాస్టల్ లో మరమ్మతులు, ఫిజికల్ ఎడ్యూకేషన్ సౌకర్యం తదితర అంశాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలపై సమీక్ష ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో మార్చి 26న అంకురార్పణ, మార్చి 27న శ్రీరామనవమి పర్వదిన ధ్వజారోహణముతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం అధికారుల‌ను ఆదేశించారు. బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌పై సోమవారం ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయం, కళ్యాణ వేదికల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను జేఈవోఅధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ 1న జ‌రుగ‌నున్న శ్రీ సీతారాముల క‌ల్యాణం ఏర్పాట్ల‌ను వేగ‌వంతం చేయాల‌ని అధికారులను జేఈవో ఆదేశించారు.క‌ల్యాణం రోజున వ‌చ్చే వేలాది మంది భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన అన్న‌ప్ర‌సాదం, తాగునీరు, మ‌జ్జిగ అందించేందుకు చ‌క్క‌టి ఏర్పాట్లు చేయాల‌న్నారు. అన్ని విభాగాలు ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ రూపొందించుకుని క‌ల్యాణం రోజున భ‌క్తుల‌కు అందాల్సిన సౌక‌ర్యాల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాల‌ని కోరారు. ఎండ వేడిమి నుంచి ఉప‌శ‌మ‌నం క‌ల్పించేందుకు భ‌క్తులు న‌డిచే ప్రాంతాల్లో కూల్ పెయింట్ వేయాల‌ని, అవ‌స‌ర‌మైన చోట్ల చ‌లువపందిళ్లు ఏర్పాటు చేయాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. ఊరేగింపు నిర్వ‌హించే వాహ‌నాలు, ర‌థానికి సంబంధించిన ప‌టిష్ట‌త‌ను ప‌రిశీలించి ఫిట్‌నెస్ స‌ర్టిఫికేట్ తీసుకోవాల‌న్నారు. .అత్య‌వ‌స‌ర వైద్య ప‌రిస్థితుల్లో వెంట‌నే స్పందించేందుకు వీలుగా అంబులెన్సులు సిద్ధంగా ఉంచుకోవాల‌ని, ప్ర‌థ‌మ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేసి త‌గిన‌న్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాల‌ని వైద్య అధికారులకు సూచించారు. సాంస్కృతిక‌, సంగీత కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన ప్ర‌ణాళిక త్వ‌రిత‌గ‌తిన సిద్ధం చేయాల‌న్నారు. క‌ల్యాణం రోజున భ‌క్తుల‌ ర‌వాణా, వ‌స‌తి, పార్కింగ్‌ క‌ల్పించేందుకు ఆర్‌టిసి అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు పూర్తి స‌న్న‌ద్ధంగా ఉండి కడప జిల్లాలోని ఆయా విభాగాల అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌న్నారు.