ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ పంచాయితీలకు మంచి రోజులు రానున్నాయి. లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS) బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (BPS) ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామ పంచాయితీలతో పంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ పంచాయితీలకు ఆర్థిక ప్రోత్సాహం అందించేందుకు గానూ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త విధానం కింద గ్రామ పంచాయతీలు తమ పరిధిలో ఎల్ఆర్ఎస్, బీపీఎస్ పథకాల కింద సమీకరించిన ఆదాయంలో సగం వాటాను పొందుతాయి. అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలకు 30 శాతం ఆదాయాన్ని కేటాయిస్తారు. మిగిలిన 20 శాతం రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగానికి వెళ్తుంది. చాలా వరకూ గ్రామ పడుతున్న నేపథ్యంలో.. ఈ విధానం ప్రకారం వాటికి కావాల్సిన నిధులు అందజేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక సంస్థల సాధికారత విషయంలో ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధిని ఈ నిర్ణయం తెలియజేస్తోందని ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ వెల్లడించారు. ఈ విధానం ప్రకారం క్రమబద్ధీకరణ పథకాల ద్వారా సమీకరించిన నిధులను తిరిగి అదే ప్రాంత అభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టనున్నట్లు వివరించారు. గ్రామ పంచాయతీలకు సగం ఆదాయం కేటాయించడం ద్వారా, ప్రభుత్వం గ్రామీణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు.అంతర్గత రహదారులు, డ్రైనేజీలు, వీధి దీపాల ఏర్పాటు, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య నిర్వహణ వంటి కనీస అవసరాలైన పనులకు కూడా నిధులు లేక పంచాయితీలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అనేక గ్రామ పంచాయతీలు సాధారణ పారిశుధ్య పనులను కూడా చేపట్టలేకపోతున్నాయి. ఆధారపడతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో LRS, BPS ఆదాయాలు స్థిరంగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. గ్రామ పంచాయతీలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను చేపట్టేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. సుదీర్ఘ చర్చల అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. రెగ్యులరైజేషన్ పథకాల ద్వారా సేకరించిన నిధులను స్థానికంగానే ఖర్చు చేయనున్న నేపథ్యంలో ఎక్కువ మంది తమ ఆస్తుల రెగ్యులరైజేషన్ కోసం ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ నిర్ణయం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.