‘బ్రహ్మముడి’ లో గృహలక్ష్మి లాస్య ఎంట్రీ.. ఇది కదా విలనిజం అంటే.. తెలుగమ్మాయా మజాకా

Wait 5 sec.

ఊహించని విధంగా బ్రహ్మముడి సీరియల్ కథ మొత్తం మారిపోయింది. దుగ్గిరాల వారి జీవితాలు తారుమారు చేసిన రుద్రాణీ, రాహుల్ కూడా చనిపోయారు. అయితే రుద్రాణీ కూతురు రేఖ బతికే ఉండటంతో పాటు పెళ్లి బంధంతో తన స్నేహితుడ్ని అతడి అక్కను ఇంటికి తీసుకొచ్చి రౌడీయిజం చేయించి మరీ.. కావ్య కూతురికి గార్డియన్‌గా మారడంతో అపర్ణా దేవి చేతిల్లో ఉండాల్సిన హక్కులన్నీ పోయాయి. సుభాష్ కదల్లేని స్థితిలో కుర్చీకే పరిమితం కావడంతో అతడు చూస్తూ ఏం చేయలేని స్థితిలో ఉండిపోయాడు. ఈ క్రమంలోనే రుద్రాణీ కూతురు రేఖ చాలా అకృత్యాలు చేసింది. కావ్య కూతురు, అప్పూ కూతురు చదువుకోవడానికి వీల్లేదు అని రూల్ పాస్ చేసింది. ఇక కథనం రోజురోజుకి ఉత్కంఠగా మారుతోంది. కొత్త కథ, కొత్త తరం అంటూ బ్రహ్మముడి సెకండ్ జనరేషన్ కథలో పిల్లలు పెద్దవాళ్లు కావడం వాళ్లు ఒకరికి ఒకరు సంబంధం లేకుండా విడిపోవడం.. తిరిగి దుగ్గిరాల సామ్రాజ్యాన్ని చేజెక్కించుకోవడం అన్న దిశగా కథ నడుస్తోంది. కావ్య కూతురు ఇందు పెద్దదైపోయినట్లు చూపించారు నేటి కథనంలో. అచ్చం కళావతిలానే ఉంది. మరోవైపు బుల్లి స్వరాజ్.. గతం మరిచిపోవడంతో పేరు కూడా మారిపోయి.. వేరే కుటుంబంలో కొడుకుగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలోనే లేటెస్ట్ ప్రోమో దద్దరిల్లింది. విలన్ రేఖ స్థానంలో నటి, యాంకర్ ప్రశాంతి (ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్‌ విలన్ లాస్య) ఎంట్రీ ఇవ్వడంతో ప్రోమో పేలిపోయింది. ఒక్క సీన్‌తోనే ముందు ముందు తన విలనిజం ఏ రేంజ్‌లో ఉంటుందో శాంపిల్ చూపించింది యాంకర్ ప్రశాంతి. కావ్య కూతురు ఇందు (ఇందిరా దేవి) ఇంటి పనులు అన్నీ పని మనిషిలా చేస్తూ ఉంటుంది. ఆ క్రమంలోనే రుద్రాణీ, రాహుల్‌ల ఫొటోలను శుభ్రపరుస్తుంటే.. రుద్రాణీ ఫొటో చేజారి పగిలిపోతుంది. బెదిరిపోయిన కావ్య బిక్క ముఖం వేసి చూసేలోపు.. రేఖ ఎంట్రీ ఇస్తుంది రాక్షసిలా చూస్తూ. అప్పటికే అపర్ణా దేవి అవటివాడైన సుభాష్‌ని తీసుకుని వస్తే.. రేఖ ఆడపడుచు (మిర్చి మాధవి) అయ్యో అయ్యో ఫొటో పడేస్తావా అని నెత్తి నోరు బాధుకుంటూ ఆవేశంగా వస్తుంది అక్కడికి. ఇక రేఖ భర్త, రేఖ ఆడపడుచు భర్తతో పాటు సీన్‌లో స్వప్న కూతురు కూడా ఉన్నట్లే ఉంది. అదంతా పక్కనపెడితే.. ‘పగిలింది అద్దమే కదా.. నేను సరి చేయిస్తాను’ అని ఇందు.. రేఖకు సంజాయిషీ ఇస్తుంటే.. ‘పగిలింది అద్దమే అనిపిస్తుందా నీకు? పగిలింది మా అమ్మ ఫొటో.. అది తెలియడం లేదా నీకు?’ అని ఆవేశంగా ఇందు మీదకు చేయి ఎత్తేస్తుంది రేఖ. అపర్ణదేవి వచ్చి వారిస్తుంది. రేఖ స్థానంలో సీరియల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యాంకర్ ప్రశాంతి ఈ సీన్‌లో వణికించేసింది. కొత్త కథ, కొత్త తరం మొదలైనప్పటి నుంచి బ్రహ్మముడి సీరియల్ ఉత్కంఠగా మారిన మాట వాస్తవం. ఈ క్రమంలో యాంకర్ ప్రశాంతి, మిర్చీ మాధవి లాంటి నటులు విలన్ రోల్స్‌లో ఉండటంతో కథనం మరింత ఆసక్తికరంగా మారిపోతుంది. గృహలక్ష్మి సీరియల్‌లో లాస్యగా విలనిజం పండించిన లాస్య.. మేటి నటి అనడంలో సందేహం లేదు. ఆమె హావభావాలతో పాటు.. నాజూగ్గా ఉండే ఆమె బ్యూటీనెస్ లేడీ విలన్ కత్తిలా ఉందే అనేట్టు చేస్తుంది. అయితే ఆమె ఎంత బాగా నటించినా మెప్పించినా కూడా.. ఆమె తెలుగు నటి కావడంతో సరైన అవకాశాలైతే ఉండవు మరి. గృహలక్ష్మి సీరియల్ తరువాత నుంచి ఖాళీగానే ఉన్న ప్రశాంతి.. ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్‌లో బెంబేలెత్తించేందుకు రెడీ అయ్యింది.