ఏపీలో మహిళలకు ఉమెన్స్ డే కానుక.. మొత్తం 9 వరాలు, డ్వాక్రా మహిళలకు రెండు పథకాలు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు వరాలు ప్రకటించారు. ఈ నెల 8న మహిళా దినోత్సవం రోజు జరిగే బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటనలు చేయనున్నారు. అలాగే మహిళల సంరక్షణ కోసం ఉమ్మడి జిల్లాల లెక్కలో వన్‌స్టాప్‌ సెంటర్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 10 వన్‌స్టాప్ సెంటర్లను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 8న ప్రారంభిస్తారు. టెక్కలి (శ్రీకాకుళం జిల్లా), రంపచోడవరం (పోలవరం జిల్లా), తిరువూరు (ఎన్టీఆర్‌), తణుకు (పశ్చిమగోదావరి), తుళ్లూరు (గుంటూరు), మాచర్ల (పల్నాడు), మార్కాపురం (మార్కాపురం), కుప్పం (చిత్తూరు),మదనపల్లె (అన్నమయ్య), ఆదోని (కర్నూలు) ల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఈ వన్‌స్టాప్ సెంటర్లను అద్దె భవనాల్లో ప్రారంభిస్తారు.. ఆ తర్వాత నిర్మాణాలు పూర్తి చేస్తారు. ఈ నిర్మాణాలను కేంద్రం ఇచ్చిన రూ.6 కోట్ల గ్రాంటుతో పూర్తి చేస్తారు. ఈ నెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 23 వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్స్ కోసం ప్రత్యేకంగా యాప్‌ను చంద్రబాబు ఆవిష్కరిస్తారు. ఈ యాప్ సాయంతో హాస్టల్స్‌లో ఎలాంటి సౌకర్యాలు, వసతి అందుబాటులో ఉన్నాయో తెలుసుకుని నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు కొత్తగా మరో 30 వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.. దీనిపై కూడా ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. వీటితో పాటుగా డ్వాక్రా మహిళలకు సంబంధించి.. మన డబ్బులు- మన లెక్కలు యాప్, ‘స్వయం’ బ్రాండింగ్‌‌ను కూడా ప్రారంభిస్తారు. ఏపీ ప్రభుత్వం వెదురు, మునగ సాగును ప్రోత్సహిస్తోంది.. దీని కోసం ప్రాసెసింగ్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది. రంపచోడవరంలో రూ.65 లక్షలతో వెదురు ప్రాసెసింగ్‌ ప్లాంట్, చిత్తూరులో రూ.70 లక్షలతో ఏర్పాటు చేయనున్న మునగ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ శంకుస్థాపన చేయనున్నారు. విజయవాడ, విశాఖపట్నంలో నిర్మించనున్న ప్రాంతీయ శిక్షణ కేంద్రాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు. అలాగే 5 తృప్తి క్యాంటీన్లను కూడా సీఎం ప్రారంభిస్తారు. మహిళా సాధికారత కల్పన కోసం ఎన్‌ఈసీసీ, ఐఎస్‌బీ, అమృత్‌ యూనివర్సిటీ సహా పలు సంస్థలతో సెర్ప్, మెప్మా ఒప్పందాలు చేసుకుంటాయి. అంతేకాదు మహిళా దినోత్సవం సందర్భంగా.. ను కూడా ప్రారంభించనున్నారు. ఈ రెండు పథకాల కింద డ్వాక్రా మహిళలకు రూ.10 వేల నుంచి రూ. లక్ష వరకు రుణాలు ఇస్తారు. ఈ రుణాలను పావలా వడ్డీకే అందజేయనున్నారు. మొత్తం మీద మహిళా దినోత్సవం రోజు మహిళలకు ప్రభుత్వం శుభవార్తలు చెప్పింది.