సుకన్య యోజన సహా ఈ 5 పథకాల్లో డబ్బులేస్తే నో ట్యాక్స్.. ప్రతి ఏటా రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు!

Wait 5 sec.

Tax Exempt Investment: ఏదైనా మార్గంలో పెట్టుబడి పెడుతున్నప్పుడు గరిష్ఠ రాబడులు రావాలని కోరుకుంటారు. ట్యాక్స్ తక్కువగా పడేలా ప్లాన్ చేసుకుంటారు. భారత్‌లో ఈఈఈ పెట్టుబడి మార్గాలు ఇప్పటికీ అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ పథకాల్లో ట్రిపుల్ బెనిఫిట్స్ లభిస్తాయి. అందులో పెట్టుబడి పెట్టినప్పుడు పన్ను మినహాయింపులు పొందడంతో పాటు ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ వస్తాయి. అంటే మెచ్యూరిటీ సొమ్ముపైన ఎలాంటి ట్యాక్స్ ఉండదు. ప్రతి సంవత్సరం చెల్లించే వడ్డీపైనా ట్యాక్స్ కట్టక్కర్లేదు. దీంతో లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం ఈ పథకాలను ఎక్కువ మంది ఎంచుకుంటున్నారు. అయితే, ఈఈఈ బెనిఫిట్ అనేది కొన్ని పథకాల్లో మాత్రమే లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో కొన్నింటికి ఈ ప్రయోజనాన్ని కల్పిస్తున్నారు. అందులో పీపీఎఫ్, సహా 5 పథకాలు ఉన్నాయి. వాటి గురించిన వివరాలు తెలుసుకుందాం. 1.పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ఇందులోని పెట్టుబడికి, మెచ్యూరిటీ డబ్బులకు, వడ్డీకి గ్యారెంటీ ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. అంటే EEE బెనిఫిట్ లభిస్తుంది. ప్రస్తుతం ఈ పథకంలో వార్షికంగా 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. గత 6 సంవత్సరాలుగా ఈ వడ్డీని మార్చలేదు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలుగా ఉంటుంది. పోస్టాఫీస్ లేదా బ్యాంకులో అకౌంట్ తెరిచి రూ.500 నుంచి రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 2. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఈ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్‌ని నిర్వహిస్తుంది. ఈ స్కీమ్ శాలరీ పొందుతున్న ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రూ.15000 వరకు మూలవేతనం గల ఉద్యోగులకు పీఎఫ్ ఖాతా ఇస్తారు. ఇది ఒక రిటైర్మెంట్ స్కీమ్ అని చెప్పవచ్చు. ఉద్యోగికి 58 ఏళ్ల వయసు వచ్చే వరకు కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ఉద్యోగం మానేసిన 12 నెలల తర్వాత పూర్తి డబ్బులు తీసుకునేందుకు అవకాశం ఇస్తున్నారు. ఇందులో ప్రస్తుతం 8.25 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ స్కీమ్ ద్వారాను EEE ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే రూపాయి ట్యాక్స్ కట్టక్కర్లేదు. 3. వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ స్కీమ్‌కి పొడిగింపుగా ఈ వాలండరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF) ఉంటుంది. శాలరీ ఉద్యోగులు పరిమితికి మించి బేసిక్ వేతన పొందుతున్నప్పుడు ఈ స్కీమ్ ద్వారా అదనంగా డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ కి సైతం కేంద్రం హామీ ఉంటుంది. ఇందులో 5 ఏళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఈ స్కీమ్ సైతం EEEట్యాక్స్ బెనిఫిట్స్ కల్పిస్తుంది. అయితే, 2,50,000 వరకు కంట్రిబ్యూషన్స్‌కి మినహాయింపు లభిస్తుంది. ఈ పరిమితి దాటితే టీడీఎస్ కట్టాల్సి రావచ్చు. 4. సుకన్య సమృద్ధి యోజన10 సంవత్సరాల లోపు ఆడ పిల్లల పేరుపై ఇందులో డిపాజిట్ చేయవచ్చు. ప్రస్తుతం ఇందులో అత్యధికంగా 8.20 శాతం మేర వడ్డీ ఇస్తున్నారు. ఒక కుటుంబంలో ఇద్దరు ఆడ పిల్లల పేరుపై ఖాతా తెరవవచ్చు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 21 సంవత్సరాలు ఉంటుంది. అయితే, అమ్మాయికి ముందే పెళ్లి అయితే డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. 5. నేషనల్ పెన్షన్ సిస్టమ్భారతీయ పౌరులు 18-70 ఏళ్ల వయసు ఉన్న వారందరికీ ఈ జాతీయ పింఛను పథకం అందుబాటులో ఉంటుంది. సాయుధ దళాల్లో ఉన్న వారికి మాత్రం ఉండదు. రిటైర్మెంట్ తర్వాత 60 శాతం వరకు విత్ డ్రా చేసుకుని మిగితా పెన్షన్ కోసం యాన్యుటీ స్కీమ్ ఎంచుకోవాల్సి ఉంటుంది. టైర్-1 అకౌంట్లో కనీస డిపాజిట్ రూ.500గా ఉంది. ఇందులో సెక్షన్ 80సీసీడీ ప్రకారం రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. టైర్-2 ఖాతాలో కనీస డిపాడిట్ రూ.250గా ఉంది. ఇందులో డిపాజిట్ చేస్తేనే టైర్ 1 అకౌంట్ యాక్టివ్ గా ఉంటుంది. ఇందులో 9-12 శాతం వరకు రాబడులు వచ్చే అవకాశం ఉంటుంది. పాక్షిక విత్ డ్రాయల్ కు అవకాశం ఉంటుంది.