బ‌య్యారంలో గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

Wait 5 sec.

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, కేంద్ర ఉక్కు శాఖ స‌హాయ మంత్రి భూప‌తిరాజు శ్రీ‌నివాస వ‌ర్మల‌తో రేవంత్ రెడ్డి శనివారం ఉదయం భేటీ అయి చర్చించారు. తెలంగాణలోని బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పాలంటూ కేంద్రమంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన వినతి పత్రాన్ని కేంద్రమంత్రికి అందించారు. బయ్యారంలో ఉక్కు ప్లాంట్ ఏర్పాటు చేస్తే జరిగే ప్రయోజనాలను వివరించారు. బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ (ఉక్కు ప‌రిశ్ర‌మ‌) ఏర్పాటు చేయాలని ఉక్కు, భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి హెచ్‌.డి.కుమార‌స్వామికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. గ్రీన్‌స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఉక్కు కొరత తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు క‌లుగుతుంద‌ని తెలిపారు. ఢిల్లీలో హెచ్‌.డి.కుమార‌స్వామి, ఉక్కు శాఖ స‌హాయ మంత్రి భూప‌తిరాజు శ్రీ‌నివాస వ‌ర్మ‌ల‌తో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి శ‌నివారం ఉద‌యం స‌మావేశ‌మ‌య్యారు.అదే సమయంలో కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ రైజింగ్–2047 విజన్‌లో భాగంగా తయారు చేసిన పారిశ్రామిక ప్రతిపాద‌నల‌ను కూడా కేంద్రమంత్రుల‌కు సీఎం రేవంత్ రెడ్డి అందించి.. వివ‌రించారు. తెలంగాణ‌లో పాత వాహ‌నాల‌ ద్వారా వచ్చే స్క్రాప్‌తో ఉక్కును రీసైకిల్ చేసే ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాల‌ని విజ్ఞప్తి చేశారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీ, భారీ ప‌రిశ్రమ‌లు, పారిశ్రామిక ఉత్పత్తికి ఉన్న అనుకూలత‌ల కారణంగా దేశ పారిశ్రామిక ఉత్పత్తి లక్ష్యాలకు హైద‌రాబాద్ నగరం ఒక కేంద్రంగా నిలుస్తుందని కేంద్రమంత్రుల‌కు రేవంత్ రెడ్డి వెల్లడించారు.అదే సమయంలో హైడ్రోజన్‌ టెక్నాలజీతో గ్రీన్‌ స్టీల్ క్లస్టర్.. ఆటో.. రక్షణ రంగాలకు అవసరమైన ఉత్పత్తుల త‌యారీ ప‌రిశ్రమ‌లు.. ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ)కొనుగోళ్లు భారీగా పెరుగుతున్న నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో ఈవీ బ్యాటరీల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌ని కేంద్రమంత్రులు కుమార‌స్వామి, శ్రీ‌నివాస‌ వ‌ర్మల‌ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మరోవైపు.. మెషిన్ టూల్స్, రోబోటిక్స్ వంటి అత్యాధునిక పరికరాల తయారీకి స్పెషల్ పార్క్‌ను కూడా ఏర్పాటు చేయాల‌ని కేంద్రమంత్రుల‌కు సీఎం విజ్ఞప్తి చేశారు.2034 నాటికి హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చే లక్ష్యంతో వాహనాలను.. ఎలక్ట్రిక్ వెహికల్స్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి స‌హ‌క‌రించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అత్యాధునిక పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్కిల్స్‌ను నేర్పించే నేషనల్ లెవల్ సంస్థల‌ను హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేయాల‌ని కేంద్రమంత్రుల‌కు రేవంత్ రెడ్డి సూచించారు.