మహిళా రిజర్వేషన్లు, ప్రక్రియపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న వేళ.. ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియను 2016 నాటి పెద్ద నోట్ల రద్దుతో పోల్చిన థరూర్.. దీనిపై పునరాలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఇది కూడా పెద్ద నోట్ల రద్దు మాదిరిగా దేశానికి నష్టం కలిగిస్తుందని ఆయన అన్నారు. ‘‘సహకార సమాఖ్య వ్యవస్థలో ఏం జరుగుతుంది? నోట్ల రద్దు ఎంత తొందరపాటు చర్యో... నియోజకవర్గాల పునర్విభజన కూడా అంతే తొందరపాటు చర్య.. దురదృష్టవశాత్తూ ఆ నిర్ణయం ఎంత నష్టం కలిగించిందో మనకు తెలుసు.. డీలిమిటేషన్ కూడా ‘పెద్ద రాజకీయ నోట్ల రద్దు’లా మారుతుంది.. కాబట్టి ఈ ప్రక్రియను నిలిపివేయడం ఉత్తమం’’ అని శశిథరూర్ తో పాటు కేంద్రపాలిత ప్రాంతాల నియోకవర్గాల పునర్విభజన బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు అనే రెండు సాధారణ బిల్లులను లోక్‌సభ గురువారం కేంద్రం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.‘‘మహిళా రిజర్వేషన్లకు దాదాపు ఏకగ్రీవ రాజకీయ ఏకాభిప్రాయం ఉన్న కీలక తరుణంలో ఈ రోజు మనం నిలబడి ఉన్నాం... నామమాత్రపు చర్యల కాలం ముగిసిందని, సామూహిక భాగస్వామ్య శకం ప్రారంభం కావాలని ప్రతి ప్రధాన పార్టీ గ్రహించింది. అయినప్పటికీ, మన ముందున్న ఈ శాసనపరమైన ప్రక్రియ నన్ను తీవ్రంగా కలవరపరుస్తోంది.. మా ప్రభుత్వం ‘నారీ శక్తి’ న్యాయమనే బహుమతిని తీసుకొచ్చిందని ప్రధాని చెబుతున్నారు. కానీ, 2011 జనాభా లెక్కల ప్రకారం పార్లమెంటు సభ్యుల సంఖ్యను పెంచడం, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ వంటి వాటికి ముడివేస్తూ ఆ బహుమతికి ఆయన ముళ్లకంచె వేశారు’’ అని ఆ ఎంపీ అన్నారు.మహిళా రిజర్వేషన్లు అమలుకు సిద్ధంగా ఉన్నాయని, ప్రస్తుత పార్లమెంటు సభ్యుల సంఖ్యను బట్టి తక్షణమే దానిని అమలు చేయవచ్చని, అలా చేయాలని ఆయన అన్నారు. ‘‘స్పీకర్ సర్ ఒక నైతిక బాధ్యతను జనాభా లెక్కల చిక్కుముడితో ఎందుకు ముడిపెట్టాలి? మహిళా రిజర్వేషన్ల అనే పంట కోతకు (అమలుకు) సిద్ధంగా ఉంది... దానిని నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడం అంటే, భారతదేశ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన, సంక్లిష్టమైన పరిపాలనా ప్రక్రియలలో ఒకదానికి భారతీయ మహిళల ఆకాంక్షలను బందీగా చేయడమే’’ అని ఆయన అన్నారు.ఈ ప్రక్రియ జనాభా పెరుగుదలను నియంత్రించిన రాష్ట్రాలు, అరికట్టని రాష్ట్రాలకు మధ్య అసమతౌల్యతను సృష్టిస్తుందని శశిథరూర్ అభిప్రాయపడ్డారు. ‘‘డీలిమిటేషన్ వల్ల కలిగే పర్యవసానాల గురించి మనం మనం నిష్కపటంగా ఉండాలి... దీనిపై లోతైన చర్చ అవసరం. ఇందులో మూడు ప్రధాన లోపాలు చిన్న, పెద్ద రాష్ట్రాల మధ్య సమతౌల్యత. రెండోది జనాభా నియంత్రణ లక్ష్యాలను విజయవంతంగా అమలు చేసిన తమిళనాడు, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలకు.. వాటిని సాధించని ఉత్తరాది రాష్ట్రాలకు మధ్య ఉన్న వ్యత్యాసం. మూడోది పునర్విభజన ప్రక్రియ వల్ల జనాభాను నియంత్రణలో విఫలమైన రాష్ట్రాలకే అధిక రాజకీయ ప్రాధాన్యత లభించి, అవి రివార్డు పొందినట్టు అవుతుంది’’ అని థరూర్ వ్యాాఖ్యానించారు.