ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్.. న్యూ ఇయర్ వేళ బంపరాఫర్, పండగ చేస్కోండి

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31, జనవరి 1 తేదీలలో మద్యం షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బార్లకు మాత్రం 1 గంట వరకు అనుతి ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకుంది. మద్యం షాపులు, బార్ల సమయాలను పొడిగించి ప్రజలు వేడుకలను మరింత ఉత్సాహంగా జరుపుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ సడలింపు డిసెంబర్ 31వ తేదీ రాత్రి, జనవరి 1వ తేదీ రాత్రి వరకు అమలులో ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు బార్లకు, అలాగే ఇన్-హౌస్ లైసెన్సులు కలిగిన ప్రదేశాలకు, ఈవెంట్ పర్మిట్ లైసెన్సులు పొందిన వారికి కూడా వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనితో పాటు, మద్యం విక్రయాలు కూడా అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగించవచ్చు.అలాగే నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఏపీ టూరిజం ఆధ్వర్యంలో నడిచే లైసెన్సులకు కూడా ఈ సడలింపు వర్తిస్తుంది. డిసెంబర్ 31, జనవరి 1 తేదీలలో అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం విక్రయాలకు అనుమతి లభించింది. పర్యాటకులు, ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా మెమో జారీ చేసింది. ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పియూష్ కుమార్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం, ఏపీ టూరిజం లైసెన్సుల కింద పనిచేసే యూనిట్లు కూడా ఈ పొడిగించిన సమయాల్లో మద్యం విక్రయించవచ్చు. ఈ నిర్ణయం వల్ల మద్యం విక్రయాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయి. ఈ సడలింపు వల్ల మద్యం షాపుల యజమానులు కూడా సంతోషంగా ఉన్నారు. ఏపీలో సందర్భంగా మద్యం షాపుల సమయాలను పొడిగించామని.. ఈ పొడిగింపుతో పాటుగా చట్టాన్ని, శాంతిభద్రతలను, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని గట్టిగా చెప్పింది. ఈ విషయంలో ఎటువంటి రాజీ పడబోమని అధికారులు స్పష్టం చేశారు.ఈ వేడుకలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా చూడటానికి పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుంది. అధికారుల పర్యవేక్షణలో, సమన్వయంతో పనిచేస్తూ, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి, వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని ప్రభుత్వం కోరింది.కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే ఈ సమయంలో, అందరూ సురక్షితంగా, నియమ నిబంధనలకు లోబడి వేడుకలు జరుపుకోవాలని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.