న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌కు సీనియర్ ప్లేయర్లు దూరం.. ఇద్దరు తెలుగు క్రికెటర్లకు సూపర్ ఛాన్స్..!

Wait 5 sec.

భారత్‌, శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. దీనికంటే ముందు టీమిండియా న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది. ఇప్పటికే టీ20 సిరీస్‌కు 15 మందితో కూడిన జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే విజయ్ హజారే ట్రోఫీ 2025-26 నేపథ్యంలో న్యూజిలాండ్‌తో వన్డే ఆడే భారత జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ సిరీస్‌కు సంబంధించి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వన్డే జట్టులో సీనియర్ ప్లేయర్లు జ సమాచారం. వీరి స్థానంలో యువ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు ప్లేయర్లకు సూపర్ ఛాన్స్.. కాగా, న్యూజిలాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ నుంచి స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, జస్‌ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరే కాకుండా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 నేపథ్యంలో.. ఈ మెగా టోర్నీకి ఎంపికైన మంది ఆటగాళ్లల్లో వీలైనంత మందిని.. వన్డే సిరీస్‌కు దూరంగా ఉంచాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. హార్దిక్ పాండ్యతో పాటు జస్‌ప్రీత్ బుమ్రా వర్క్‌లోడ్‌ను తగ్గించాలనే ఉద్దేశంతో బోర్డు బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే హార్దిక్ పాండ్య స్థానంలో , బుమ్రా స్థానంలో మహమ్మద్ సిరాజ్‌ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య అద్భుత ప్రదర్శన చేశాడు. 3 ఇన్నింగ్స్‌ల్లో 142 పరుగులు చేయడంతో పాటుటీ20ల్లో 100 వికెట్లు, 100 సిక్సర్లు బాదిన ఘనత దక్కించుకున్నాడు. హార్దిక్ పాండ్య చివరి వన్డే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆడాడు. ఇక జస్‌‌ప్రీత్ బుమ్రా వన్డే ప్రపంచకప్ 2023 తర్వాత ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడకపోవడం గమనార్హం. కాగా, బీసీసీఐ సెలెక్షన్ కమిటీ 2026 జనవరి 4 లేదా 5 తేదీల్లో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో ఆడే జట్టును ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు, టీమిండియా, న్యూజిలాండ్ మధ్య వడోదర వేదికగా జనవరి 11న తొలి వన్డే జరుగుతుంది. ఇక రాజ్‌కోట్‌లో జనవరి 14న రెండో వన్డే, ఇండోర్‌లో జనవరి 18న మూడో వన్డే ఆడనున్నారు.