, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన సినిమా 'అఖండ 2: తాండవం'. బ్లాక్ బస్టర్ 'అఖండ' సీక్వెల్ గా, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కింది. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. నందమూరి అభిమానులను మాత్రం విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాకి కేంద్ర మంత్రి బండి సంజయ్ రివ్యూ ఇచ్చారు. 'అఖండ 2' సినిమా చూసిన తర్వాత ఇన్ని రోజులు తన జీవితం వృధా చేసానని అనిపించిందని బండి సంజయ్ అన్నారు. "ఇన్ని రోజులు నా జీవితాన్ని, సమయాన్ని వృథా చేసుకున్నా.. కనీసం ఇప్పటి నుంచైనా.. మిగిలిన జీవితాన్ని ధర్మానికి అర్పించాలి.. ధర్మం కోసం పని చేయలే.. దేశం కోసం పనిచేయాలని.. 100 శాతం ఆలోచన తెప్పించే సినిమా అఖండ-2" అని తెలిపారు. ఇప్పుడు బాలకృష్ణ సినిమాలు కాలేజ్ స్టూడెంట్స్ బెట్టింగ్ వేసుకొని మరీ చూస్తున్నారని, సీనియర్ ఎన్టీఆర్ గారిని మైమరిపించేలా బాలకృష్ణ యాక్టింగ్ చేస్తున్నాడని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బాలకృష్ణలో సీనియర్ ఎన్టీఆర్ ని చూసుకుంటున్నామని, 'అఖండ 2' సినిమాలో బాలకృష్ణను చూస్తే పరమేశ్వరుడే ప్రత్యక్షం అయ్యాడనిపించింది బండి సంజయ్ పేర్కొన్నారు.