అంబికా దర్బార్ బత్తి సరికొత్త ప్రొడక్ట్.. బాక్స్ తెరిస్తే చాలు సుప్రభాతం వినిపించేలా..!

Wait 5 sec.

"అమ్మను మర్చిపోలేము.. అంబికాను మర్చిపోలేము".. "భగవంతునికి, భక్తునికి అనుసంధానమైనది.. మన అంబికా" లాంటి యాడ్‌లతో ప్రతీ ఒక్క ఇంటినీ గత కొన్ని దశాబ్దాలుగా సుమధురంగా మార్చిన ప్రముఖ అగర్‌బత్తి తయారీ సంస్థ అంబికా.. భక్తి ప్రపంచంలో సరికొత్త విప్లవానికి తెరలేపింది. హైదరాబాద్ శివారు శంషాబాద్ సమీపంలో ముచ్చింతల్‌లోని శ్రీరామనగరం (సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం) వేదికగా.. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ దివ్య హస్తాలతో రాగస్వర సుప్రభాతం అనే వినూత్న ప్రొడక్ట్‌ను ఆవిష్కరించింది.సాధారణంగా అగర్‌బత్తి వెలిగిస్తే సువాసన వస్తుంది. కానీ అంబికా సంస్థ రూపొందించిన ఈ రాగస్వర సుప్రభాతం అగర్‌బత్తి బాక్స్ ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. ఈ బాక్స్‌ను తెరిచిన వెంటనే.. అందులోని ప్రత్యేక మ్యూజికల్ మెకానిజం ద్వారా శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం వినిపిస్తుంది. భక్తులు అగర్‌బత్తి వెలిగించక ముందే ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయేలా దాన్ని తయారు చేశారు.చినజీయర్ స్వామి మంగళాశాసనాలుఈ రాగస్వర సుప్రభాతం ఆవిష్కరించిన తర్వాత మాట్లాడిన చినజీయర్ స్వామి.. 125 ఏళ్లుగా అంబికా సంస్థ నాణ్యమైన సుగంధ ద్రవ్యాలతో భగవంతుడికి, భక్తుడికి అనుసంధానకర్తగా నిలుస్తోందని కొనియాడారు. దేవుడికి సమర్పించే ధూపం ముక్కుకు పరిమళాన్ని, కంటికి ఇంపును కలిగించాలని పేర్కొన్నారు. బాక్స్ తెరిచిన వెంటనే సుప్రభాతం వినిపించడం భక్తులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని చినజీయర్ స్వామి ఆశీర్వదించారు.రాగస్వర సుప్రభాతం ప్రత్యేకతలుఈ రాగస్వర సుప్రభాతం బాక్స్ తెరిచిన ప్రతిసారీ సుమారు 5 నిమిషాల పాటు పూర్తిగా సుప్రభాతం వినిపిస్తుంది. అగర్‌బత్తులు అయిపోయిన తర్వాత కూడా ఈ బాక్స్‌ను పూజా గదిలో మ్యూజిక్ ప్లేయర్‌గా ఉపయోగించుకోవచ్చు. వారంలోని ఏడు రోజులకు గానూ.. ఏడుగురు దేవతలకు సంబంధించిన ఏడు విభిన్న సువాసనలతో కూడిన ప్యాక్‌లను త్వరలోనే విడుదల చేయనున్నట్లు అంబికా సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ వినూత్న ప్రొడక్ట్ క్లాస్-1, క్లాస్-3 కింద పేటెంట్, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ పొందిందని చెప్పారు.అంబికా కృష్ణ హర్షంముచ్చింతల్ సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో 108 దివ్యదేశాల సముఖంలో ఈ ఆవిష్కరణ జరగడం తన పూర్వజన్మ సుకృతమని అంబికా సంస్థల అధినేత అంబికా కృష్ణ వెల్లడించారు. నడిచే రామానుజాచార్యులుగా భావించే చినజీయర్ స్వామి చేతుల మీదుగా తమ కొత్త ప్రొడక్ట్ విడుదల కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు అంబికా రామచంద్ర రావు, కార్తీక్ ఆలపాటి ఉన్నారు. ఈ ప్రొడక్ట్స్ త్వరలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ స్టోర్లలో, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.