శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం.. రంగంలోకి లసిత్ మలింగ.. ఇది టీ20 వరల్డ్ కప్ వ్యూహమేనా?

Wait 5 sec.

ప్రతిష్టాత్మక ఐసీసీ పురుషుల సమయం దగ్గర పడుతోంది. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ నేపథ్యంలో జట్లను రెడీ చేసుకుంటున్నాయి వివిధ దేశాలు. ఇప్పటికే బీసీసీఐ వరల్డ్ కప్ 2026 జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్ బోర్డు (శ్రీలంక క్రికెట్ -SLC) కీలక నిర్ణయం తీసుకుంది. టీ20 ప్రపంచ కప్‌కు ముందు జాతీయ పురుషుల జట్టు కోచింగ్ సిబ్బందిలో మార్పులు చేసింది. దిగ్గజ బౌలర్ లసిత్ మలింగను కన్సల్టెంట్-ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది.రాబోయే వరల్డ్ కప్‌కు ముందుకు ఉన్న సుదీర్ఘ అనుభవాన్ని ఉపయోగించుకోవాలని శ్రీలంక క్రికెట్ బోర్డు భావిస్తోంది. అందులో భాగంగా , 2025 డిసెంబర్ 15 నుంచి 2026 జనవరి 25 వరకు.. ఒక నెల కాలానికి "స్వల్పకాలిక ప్రాతిపదికన" మలింగను నియమించినట్లు క్రికెట్ బోర్డు ప్రకటించింది. వరల్డ్ కప్ జట్టు ప్రిపరేషన్‌లో మలింగ్ సపోర్ట్ చేస్తాడని పేర్కొంది. ముఖ్యంగా ఈ పొట్టి ఫార్మాట్‌లో డెత్ ఓవర్ బౌలింగ్‌లో.. మలింగ ప్రసిద్ధ నైపుణ్యాన్ని ఉపయోగించుకోవాలని అనుకుంటున్నట్లు బోర్డు వెల్లడించింది.మెగా టోర్నీకి ముందుఇలా హడావుడిగా.. షార్ట్ టర్మ్ ప్రాతిపదికన లసిత్ మలింగను కోచ్‌గా నియమించడం వెనుక కారణం లేకపోలేదు. టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా మలింగను పరిగణిస్తారు. అతడు శ్రీలంక తరఫున 84 టీ20 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. 107 వికెట్లు పడగొట్టాడు. 2014లో టీ20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో కూడా మలింగ ఉన్నాడు. అప్పుడు ధోని నేతృత్వంలోని భారత్‌ను ఫైనల్ మ్యాచ్‌లో ఓడించి టైటిల్ గెలుచుకుంది శ్రీలంక. ఇక మలింగ కూడా ఐపీఎల్ దిగ్గజాలలలో ఒకడు. ముంబై ఇండియన్స్ తరపున 122 మ్యాచ్‌లు ఆడి.. మొత్తం 170 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం అతడు ఐదుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచిన జట్టుకు బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు. ఈ అనుభవం కారణంగానే మలింగను వీలైనంత వాడుకోవాలని శ్రీలంక క్రికెట్ భావిస్తోంది. కాగా, టీ20 ప్రపంచ కప్‌కు ముందు శ్రీలంక.. పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. 2026 జనవరి 7, 9, 11 తేదీల్లో ఈ మ్యాచ్‌లు ఉంటాయి. ఈ మ్యాచ్‌ల సందర్భంగా మలింగ.. వరల్డ్ కప్ జట్టు బౌలర్లకు మెలకువలు నేర్పే అవకాశం ఉంది. అనంతరం వరల్డ్ కప్‌కు అన్ని వ్యూహాలతో జట్టు సిద్ధం కానుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.