న్యూ ఇయర్ వేళ పండగ చేసుకున్న డెలివరీ బాయ్స్.. రూ. 100 కోట్లకుపైనే చెల్లింపులు.. రికార్డులన్నీ బ్రేక్!

Wait 5 sec.

: 2026 నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా.. జనం ఎక్కువగా ఆహారం, కూల్ డ్రింక్స్, పిజ్జా, బర్గర్స్, కేక్స్ ఇలా విపరీతంగా ఆర్డర్ చేశారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఆహార డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో సహా ఇతర క్విక్ కామర్స్ కంపెనీలైన జొమాటో, బ్లింకిట్, జెప్టో, ఇన్‌స్టా‌మార్ట్, బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్, అమెజాన్ నౌ ఇలా అన్నీ సత్తాచాటాయి. . క్షేత్ర స్థాయిలో ఇది పెద్ద ప్రభావం చూపించలేదు. ఈ క్రమంలోనే సమ్మె నేపథ్యంలో కొన్ని ఫుడ్ డెలివరీ సంస్థలు సాధారణం కంటే ఎక్కువ పేమెంట్ చేసినట్లు.. ఇన్సెంటివ్స్ ఎక్కువ ప్రకటించినట్లు ప్రచారం జరిగింది. దీంతో.. ఈ డెలివరీ బాయ్స్ (గిగ్ వర్కర్స్) ఒక్కరోజులోనే అత్యధికంగా సంపాదించినట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ వేడుకల వేళ.. అంటే డిసెంబర్ 31 సాయంత్రం నుంచి జనవరి 1 తెల్లవారుజాము వరకు వెల్లువెత్తిన ఆర్డర్ల కారణంగా.. జొమాటో, స్విగ్గీ సహా ఇతర క్విక్ కామర్స్ సంస్థలు అన్నీ కలిపి ఈ గిగ్ వర్కర్లకు ఏకంగా రూ. 100 కోట్లకుపైగా చెల్లింపులు చేశాయని సమాచారం. ఇంకా ఇన్సెంటివ్స్ దీనికి అదనం అని తెలుస్తోంది. సాధారణంగా ఫుడ్ డెలివరీ సంస్థలు, క్విక్ కామర్స్ కంపెనీలు తమ ఫుడ్ డెలివరీ నెట్‌వర్క్ కోసం సాధారణ రోజుల్లో సుమారుగా రూ. 60-70 కోట్ల వరకు వెచ్చిస్తుంటాయి. ఇప్పుడు రూ. 100 కోట్లు దాటిందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. >> ఇక్కడ ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీలు స్విగ్గీ, జొమాటోనే తమ డెలివరీ ఏజెంట్లు, గిగ్ వర్కర్లకు ఒక్కరోజులోనే రూ. 60- 70 కోట్ల వరకు చెల్లించాయి. బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్, జెప్టో వంటి క్విక్ కామర్స్ కంపెనీలు చూస్తే రూ. 50-60 కోట్ల వరకు వేతనాలు, ఇతర ప్రోత్సాహకాలు చెల్లించినట్లు తెలిసింది. ఇక్కడ సాధారణ రోజుల్లో కంటే వీరు 30-40 శాతం అధికంగా సంపాదించారు. కొన్ని కార్మిక యూనియన్స్.. డిసెంబర్ 31న గిగ్ వర్కర్ల సమ్మెకు పిలుపునిచ్చినా.. అత్యంత ముఖ్యమైన రోజులో సంపాదనను వదులుకునేందుకు ఇష్టపడలేదు. ఒకవేళ సమ్మె ప్రభావం ఉంటే గనుక.. అప్పుడు గిగ్ వర్కర్స్ దేశవ్యాప్తంగా సుమారుగా రూ. 100 కోట్ల వరకు నష్టపోయేవారేనని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇన్సెంటివ్స్ ప్రకటించడంతో ఎక్కడా డెలివరీ సిస్టమ్‌కు అంతరాయం కలగలేదని భావిస్తున్నారు. . నిమిషానికి వేలల్లో ఆర్డర్లు వస్తున్నా.. డెలివరీ భాగస్వాములు ఉత్సాహంగా పనిచేశారని సంస్థ సీఈఓ దీపిందర్ గోయల్ చెప్పారు.