తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది. శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బీఆర్ఎస్ నాయకుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధానంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము లేకనే, ఉపాధి హామీ పథకంపై చర్చ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ సభ్యులు సభ నుండి పారిపోయారని ఆయన విమర్శించారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం వైపు ఏవైనా తప్పులు ఉంటే.. సభకు వచ్చి వాటిని నిరూపించాలే తప్ప ఇలా పారిపోవడం సరికాదని ఆయన సవాల్ విసిరారు.రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని కోల్పోయిందని.. అందుకే ఇప్పుడు బీజేపీతో రహస్యంగా చేతులు కలుపుతోందని మంత్రి లక్ష్మణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్ల కాలంలో అధికారాన్ని చెలాయించిన బీఆర్ఎస్, అప్పట్లో సొంత ఎమ్మెల్యేలకు కూడా కనీస గౌరవం ఇవ్వలేదని.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ తన సొంత నిర్ణయాలనే అమలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారం కోల్పోయాక ప్రజల సానుభూతి కోసం తెగ ఆరాటపడుతున్నారని ఎద్దేవా చేశారు. మూసీ నది పునరుజ్జీవం వంటి కీలక ప్రాజెక్టులపై ప్రతిపక్షం కేవలం రన్నింగ్ కామెంటరీ చేస్తూ కాలయాపన చేస్తోందని.. ప్రజల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే వారికి ముఖ్యమని విమర్శించారు. ప్రక్రియపై మంత్రి కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరు నాటికి మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని.. కసరత్తు చేస్తోందని వెల్లడించారు. దీనివల్ల స్థానిక సంస్థల్లో కానుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థుల సౌకర్యాల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని.. ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో విద్యార్థులకు వేడి నీళ్ల సౌకర్యం కల్పించేందుకు సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శకతకు పెద్దపీట వేస్తోందని.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని అరికడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. ఉపాధి హామీ నిధుల విషయంలో కానీ.. ఇతర అభివృద్ధి పనుల్లో కానీ రాష్ట్రం తన వాటాను సక్రమంగా వినియోగిస్తోందని చెప్పారు. విపక్షాలు అనవసర రాద్ధాంతం మానుకొని.. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన హితవు పలికారు. హాస్టళ్లలో వసతుల మెరుగుదల, సకాలంలో స్థానిక ఎన్నికల నిర్వహణ ద్వారా క్షేత్రస్థాయిలో మార్పులు తీసుకురావడమే తమ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వివరించారు.