తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగానికి సాగు పనుల్లో ఎదురవుతున్న కూలీల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం ఒక కీలక అడుగు వేస్తోంది. ఈ జనవరి మాసం నుండిసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆధునిక యంత్రాల వినియోగం ద్వారా సాగు వ్యయాన్ని తగ్గించి.. రైతులకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ పథకం కింద 2025–26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం సుమారు 101.83 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ నిధులలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం వాటాను భరిస్తుండగా.. మిగిలిన 40 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుతోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిలో 1.31 లక్షల మంది అర్హులైన రైతులను ఎంపిక చేశారు. వీరికి వివిధ రకాల వ్యవసాయ పనిముట్లను రాయితీపై అందజేస్తారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మహిళా రైతులకు గరిష్టంగా 50 శాతం వరకు రాయితీ లభిస్తుంది. ఇతర వర్గాల రైతులకు 40 శాతం మేర రాయితీని ప్రభుత్వం కల్పిస్తోంది.గతంలో ప్రభుత్వం స్వయంగా యంత్రాలను కొనుగోలు చేసి పంపిణీ చేసేది. కానీ ఇప్పుడు పారదర్శకత కోసం విధానాన్ని మార్చింది. ప్రభుత్వం 16 ప్రముఖ యంత్ర తయారీ కంపెనీలను ఎంపిక చేసి (ఎం ప్యానెల్) జాబితాలో చేర్చింది. రైతులు తమకు నచ్చిన కంపెనీ నుండి నేరుగా పనిముట్లను కొనుగోలు చేయవచ్చు. రైతు వాటా మినహాయించిజజ ప్రభుత్వం అందించే రాయితీ నేరుగా ఆయా కంపెనీల ఖాతాలకు చేరుతుంది.పంపిణీ చేసిన యంత్రాలు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు వ్యవసాయ శాఖ కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. కలిగిన యంత్రాలకు జియో ట్యాగింగ్ సౌకర్యాన్ని కల్పిస్తారు. అలాగే ఇతర చిన్నపాటి పరికరాలకు ఏఐ (కృత్రిమ మేధ) ఆధారిత టెలిమాటిక్స్ కిట్‌లను అమర్చుతారు. దీనివల్ల ఆ యంత్రం ఎక్కడ ఉంది.. ఎన్ని గంటల పాటు పొలంలో పని చేసింది అనే వివరాలను అధికారులు ఐదేళ్ల పాటు నిరంతరం పర్యవేక్షించవచ్చు.రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5.50 లక్షల మంది రైతులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడం విశేషం. రబీ సీజన్ ప్రారంభంలోనే ఈ యంత్రాలు అందుబాటులోకి వస్తే.. ఇతర రాష్ట్రాల నుండి కూలీలను రప్పించాల్సిన అవసరం ఉండదని రైతులు భావిస్తున్నారు. ఎనిమిది ఏళ్ల విరామం తర్వాత ఈ పథకం పునరుద్ధరణ జరగడంతో గ్రామాల్లో యువత కూడా వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు.ఐదెకరాల లోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులు ఈ పథకానికి ప్రధానంగా అర్హులు. ట్రాక్టర్లతో నడిచే రోటోవేటర్లు, కోత యంత్రాలు, , కలుపు తీసే పరికరాలు వంటి 15 రకాల పనిముట్లు ఇందులో ఉన్నాయి. లబ్ధిదారుల ఎంపిక కోసం మండల, జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. రాజకీయ జోక్యం లేకుండా కేవలం అర్హత ఆధారంగానే ఎంపిక ప్రక్రియ జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.