: నుంచి ఎట్టకేలకు ఐపీఓ రాబోతుంది. ఓయో మాతృ సంస్థ ప్రిజమ్.. ఇప్పటికే సెబీకి (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) ముసాయిదా పత్రాలు (డ్రాఫ్ట్ పేపర్స్- DRHP) సమర్పించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో కొత్త సంవత్సరంలో ఓయో నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చిందని ఇన్వెస్టర్లు సంబరపడిపోతున్నారు. అయితే గతంలో కూడా ఇలానే రెండు సార్లు ఐపీఓకు వస్తున్నట్లే ప్రకటించి తమ అప్లికేషన్‌ను విరమించుకుంది ఓయో. తొలుత 2021లో దరఖాస్తు చేసింది. మళ్లీ రివైజ్డ్ ఫైలింగ్ చేసింది. అప్పట్లో వెనక్కి తగ్గింది. ఈసారి ఇంకా పక్కా ప్లాన్‌తో.. సమగ్ర వివరాలు సేకరించినట్లు తెలిసింది. మరి ఈసారి చివరి వరకు ఉంటుందో లేదో చూడాలి. ఈసారి ఓయో.. తన డ్రాఫ్ట్ పేపర్స్‌ను రహస్య మార్గంలోనే సమర్పించింది. దీనినే కాన్ఫిడెన్షియల్ రూట్ అంటారు. డిసెంబర్ 31నే ఐపీఓ ముసాయిదా పత్రాల్ని సెబీకి సమర్పించగా.. కొత్త సంవత్సరంలో దీని వివరాలు బయటికి వచ్చాయి. రహస్య మార్గంలో ఐపీఓకు వెళ్లేందుకు ప్రధాన కారణం.. ఎప్పుడైనా ఇక్కడ తన వివరాల్ని అప్డేట్ చేసుకునేందుకు వీలు పడుతుంది. అంటే పూర్తి వివరాల్ని ముందుగా బయటపెట్టదు. తర్వాతి దశలోనూ వీటిని మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇటీవల డిసెంబర్ నెలలోనే ఐపీఓగా వచ్చేందుకు ఓయోకు షేర్ హోల్డర్ల నుంచి ఆమోదం లభించింది. ఇక్కడ ఐపీఓలో భాగంగా పూర్తిగా కొత్త షేర్లను జారీ చేయడం ద్వారా సుమారు 740 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 6,650 కోట్ల వరకు నిధుల్ని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముందుగా ఈ గురుగ్రామ్ బేస్డ్ కంపెనీ ఐపీఓ ద్వారా సుమారు 1.2 బిలియన్ డాలర్లు (రూ. 10 వేల కోట్లకుపైగా) సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. కానీ ఈ రహస్య మార్గంలో ఐపీఓ ద్వారా చూస్తే సుమారు అంతకంటే 40-60 శాతం చిన్న సైజ్‌లో ఐపీఓ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఐపీఓ కోసం ఓయో విలువను సుమారు 5 నుంచి 7 బిలియన్ డాలర్లుగా ఉంటుందని మర్చంట్ బ్యాంకర్లు లెక్కగట్టినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ. 45 వేల కోట్ల నుంచి రూ. 63 వేల కోట్ల వరకు ఉండొచ్చన్నమాట. ఇక మార్కెట్ కండిషన్స్‌ను బట్టి తుది విలువలో మార్పులు ఉంటాయని చెబుతున్నారు. 2021 సమయంలో కంపెనీ వాల్యుయేషన్ సుమారు 12 బిలియన్ డాలర్లుగా అంచనా వేయడం గమనార్హం. ఓయో.. 2026 ప్రథమార్థంలోనే ఐపీఓగా మార్కెట్లో లిస్టింగ్ కావాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాదిలోనే న్యూ ఏజ్ కంపెనీలైన ఫోన్‌పే, జెప్టో, బోట్, షాడోఫాక్స్, షిప్‌రాకెట్ వంటివి సహా . ఇవి కూడా తమ అప్లికేషన్లను సెబీకి సమర్పించాయి.