ఆదాయపు పన్ను రూల్స్‌లో 5 మార్పులు.. ట్యాక్స్ పేయర్లకు భారీ ఊరట

Wait 5 sec.

: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు 2025 సంవత్సరం కీలక మార్పులను తీసుకొచ్చింది. కేంద్ర బడ్జెట్ 2025లో ప్రకటించిన నిర్ణయాలతో పాటు, ఆదాయపు పన్ను చట్టం 2025 () అమలు దిశగా అడుగులు పడ్డాయి. పన్ను విధానాన్ని సరళీకృతం చేస్తూ, సామాన్యులకు, సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం తీసుకున్న 5 ముఖ్యమైన నిర్ణయాలు ఉన్నాయి. ఇవి భవిష్యత్తు పన్ను చెల్లింపులను ప్రభావితం చేయనున్నాయి. మరి ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం. 1. రూ.12.75 లక్షల వరకు జీరో ట్యాక్స్కొత్త పన్ను విధానాన్ని () ఎంచుకునే ఉద్యోగులకు ఇది అతిపెద్ద శుభవార్త. సెక్షన్ 87A కింద లభించే ట్యాక్స్ రిబేటును పెంచడం ద్వారా, ఏడాదికి రూ. 12 లక్షల వరకు నికర ఆదాయం ఉన్నవారు ఎటువంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. దీనికి తోడు ఉద్యోగులకు లభించే రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను కలిపితే.. 2. సీనియర్ సిటిజన్లకు డబుల్ ఊరటబ్యాంకు డిపాజిట్లు లేదా పోస్టాఫీసు సేవింగ్స్‌పై వచ్చే వడ్డీ ఆదాయం విషయంలో సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. వడ్డీపై టీడీఎస్ (TDS) మినహాయింపు పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ. 50,000 నుంచి ఏకంగా రూ.1,00,000 కి పెంచింది. దీనివల్ల వృద్ధులు తమ పొదుపుపై వచ్చే లాభాన్ని టీడీఎస్ భయం లేకుండా పూర్తిస్థాయిలో పొందే అవకాశం ఉంటుంది.3. డివిడెండ్ ఆదాయంపై టీడీఎస్ పరిమితి పెంపుషేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే చిన్న తరహా పెట్టుబడిదారుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డివిడెండ్ ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు పరిమితిని ఏడాదికి రూ.5,000 నుండి రూ.10,000కు పెంచింది. దీనివల్ల చిన్న షేర్ హోల్డర్ల చేతికి వచ్చే డివిడెండ్ మొత్తం పెరుగుతుంది.4. అప్‌డేటెడ్ రిటర్నులు (ITR-U) దాఖలుకు 4 ఏళ్ల సమయంగతంలో ఐటీ రిటర్నులలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకుని అప్‌డేటెడ్ రిటర్నులు (ITR-U) దాఖలు చేయడానికి 24 నెలల (2 ఏళ్లు) సమయం ఉండేది. దీనివల్ల పన్ను చెల్లింపుదారులు తమ పాత పొరపాట్లను సరిదిద్దుకుని స్వచ్ఛందంగా పన్ను చెల్లించడానికి ఎక్కువ అవకాశం లభిస్తుంది. ఫలితంగా అనవసరపు నోటీసులు తగ్గుతాయి.5. కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025దశాబ్దాల నాటి 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో నూతన 'ఆదాయపు పన్ను చట్టం 2025' రూపొందించారు. ఇందులో సంక్లిష్టమైన భాషను తొలగించి, పన్ను నిబంధనలను సులభతరం చేశారు. అలాగే 'అసెస్మెంట్ ఇయర్' (Assessment Year) అనే పదాన్ని తొలగించి, సరళమైన 'ట్యాక్స్ ఇయర్' (Tax Year) అనే విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఏప్రిల్ 1, 2026 నుంచి ఇది పూర్తిస్థాయిలో అమలులోకి రానుంది.ఈ మార్పులు పన్ను చెల్లింపుదారులపై భారాన్ని తగ్గించడమే కాకుండా, పన్ను దాఖలు ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చనున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి, ఉద్యోగులకు ఈ నిర్ణయాలు పెద్ద ఊరటనిస్తున్నాయి. భవిష్యత్తు పన్ను చెల్లింపుల్లో కీలక మార్పులు రానున్నాయి. భారీ మొత్తంలో ట్యాక్స్ ఆదా చేసుకునేందుకు ఈ కొత్త రూల్స్ దోహదపడతాయి.