రైతులకు ఎగిరి గంతేసేవార్త.. కొత్త సంవత్సర కానుక.. సంక్రాంతి కంటే ముందుగానే పంపిణీ.. పూర్తిగా ప్రీ..

Wait 5 sec.

రాష్ట్రంలోని రైతులకు శుభవార్త.. ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రైతులకు గుడ్ న్యూస్ వినిపించారు. జనవరి 9వ తేదీ లోపు రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఏపీ కేబినెట్ భేటీ సోమవారం జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను మంత్రి అనగాని సత్యప్రసాద్ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఈ క్రమంలోనే రైతులకు జనవరి 9లోగా పాసుపుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. 21.8 లక్షల పాస్‌బుక్‌లను రాజముద్రతో రూపొందించామని.. జవనరి 9లోగా పంపిణీ పూర్తి చేస్తామని వెల్లడించారు. ఎలాంటి తప్పులు లేకుండా.. తప్పులు సరిచేశాకే పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని ఆదేశించినట్లు మంత్రి సత్యప్రసాద్ వివరించారు.మరోవైపు వైసీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 8 వేల గ్రామాల్లో భూముల సమగ్ర రీసర్వే ప్రక్రియనిర్వహించారు. అనంతరం రైతులకు క్యూఆర్‌ కోడ్‌తో కూడిన కొత్త పట్టాదారు పాస్‌బుక్స్ పంపిణీ చేశారు. అయితే వైసీపీ హయాంలో రైతులకు జారీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాల మీద అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బొమ్మ ఉండటాన్ని టీడీపీ తప్పుబట్టింది. అలాగే భూముల సర్వే సక్రమంగా జరగలేదంటూ.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రీసర్వే చేపడతామని ప్రకటించింది. అలాగే కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను రైతులకు అందిస్తామని ఎన్నికల సమయంలో ప్రజలకు హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం.. రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు ఉచితంగా జారీ చేయనుంది.మరోవైపు కొత్త పాసుబుక్స్‌ ఇప్పటికే ఎమ్మార్వో కార్యాలయాలకు చేరుకున్నాయి. అయితే వాటిలో తప్పులు లేకుండా చూడాలనే ఉద్దేశంతో.. పాస్‌బుక్స్‌లోని సమాచారం, భూముల వివరాలు కచ్చితంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.. అందులో భాగంగా ప్రతి పట్టాదారు పాసుబుక్కులోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు ఆ విషయంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే జనవరి 9లోగా రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు అందిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.