ఫ్యూచర్ సిటీపై కీలక నిర్ణయం.. 30 వేల ఎకరాల్లో.. 30 నెలల్లోనే పూర్తి చేసేలా

Wait 5 sec.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుపై కీలక అప్‌డేట్ వచ్చేసింది. దీనిలో మొత్తం 11 టౌన్‌షిప్‌లు రానున్నాయి. వీటికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా.. ఈ ప్రాజెక్టు బాధ్యతలను చూస్తున్న అధికారులకు వివరించారు. మరో 30 నెలల్లో నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యాలు నిర్దేశించారు. ముందుగా ఈ ఫ్యూచర్ సిటీ ప్రణాళికను రూపొందించినప్పుడు ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ సిటీ, కృత్రిమ మేధ నగరం, ఎలక్ట్రానిక్స్ సిటీ మాత్రమే నిర్మించాలనుకున్నారు.అయితే తాజాగా ఆ ప్రణాళికను మార్చారు. .. ఇక్కడ ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 70 శాతం సంస్థలకు ఫ్యూచర్ సిటీలోనే వాటి కార్యాలయాలు ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈక్రమంలో ప్రస్తుతం అధికారులు.. సీఎం ఆలోచనల మేరకు ప్రణాళికలు రూపొందించే పనిలో ఉన్నారు. ఫ్యూచర్ సిటీలో నిర్మించబోయే టౌన్‌షిప్‌లన్నీ పర్యావరణ హితంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోబోతున్నారు.హైదరాబాద్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కందుకూరు మండలంలోని ముచ్చర్ల, మీర్‌ఖాన్‌పేట గ్రామాల మధ్య సుమారు 30 వేల ఎకరాల్లో నిర్మాణం జరగబోతుంది. దీనిలో 11 టౌన్‌షిప్‌లను చేపట్టనున్నారు. ఈ క్రమంలో వీటి డిజైన్, అనుమతులు, ఇతర పనుల వంటి వ్యవహారాలను చూసేందుకు ప్రభుత్వం అక్కడే ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉండగా, ఎడ్యుకేషన్ సిటీలో భాగంగా.. 2024, డిసెంబర్ 9న నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. వృత్తి విద్య అభ్యసించే విద్యార్థుల కోసం ఇక్కడ ప్రత్యేకంగా **ఏటీసీ (అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌)**ని కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు 1 నుంచి 10వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. త్వరలోనే మిగిలిన టౌన్ షిప్‌ల నిర్మాణ పనులు కూడా ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు.11 టౌన్‌షిప్‌లు ఏవంటే:ఎడ్యుకేషన్ సిటీఫర్నిచర్అంతర్జాతీయ పార్క్రిక్రియేషన్ జోన్రెసిడెన్షియల్ టౌన్‌షిప్విద్యుత్ వాహనాలులైఫ్ సైన్సెస్ఎలక్ట్రానిక్స్కృత్రిమ మేధ నగరంస్పోర్ట్స్ సిటీమెడికల్ టూరిజం జోన్త్వరలోనే వీటి నిర్మాణాల పనులు ప్రారంభం అవుతాయి. 30 నెలల్లో వీటిని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.