'నువ్వేమైనా రోహిత్, కోహ్లివా.. ఏంటా యాట్టిట్యూడ్'.. టీమిండియా ఆల్‌రౌండర్‌పై ఫ్యాన్స్ గరం..

Wait 5 sec.

ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడిని త్వరలో జరిగే న్యూజిలాండ్‌ సిరీస్‌తో పాటు వచ్చే నెలలో జరగబోయే ఐసీసీ పురుషుల కూడా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మైదానానికి దూరంగా ఉన్న వాషింగ్టన్ సుందర్.. విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే అతడు ఓ హోటల్‌లో బస చేసిన సందర్భంగా జరిగిన సంఘటనతో చిక్కుల్లో పడ్డాడు. అతడిపై క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. అంత యాట్టిట్యూడ్ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. వాషింగ్టన్ సుందర్ యాట్టిట్యూడ్‌ క్రికెట్ ఫ్యాన్స్ గరం..ప్రాక్టీస్ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న వాషింగ్టన్ సుందర్.. ఓ హోటల్‌లో బస చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో ప్రకారం.. శుక్రవారం (2026 జనవరి 2) వాషింగ్టన్ సుందర్ ఒక హోటల్ నుండి బయటకు వస్తున్నట్లు కనిపించాడు. అయితే, ఆ క్రికెటర్‌ను చూడటానికి, సెల్ఫీ తీసుకోవడానికి ఒక్కసారి క్రికెట్ అభిమానులు అతడి వద్దకు వచ్చారు. అయితే సెల్ఫీల కోసం అభిమానులు తరుముతున్నా.. ఏం జరగనట్లు ప్రవర్తించాడు. అంతేకాకుండా వాషింగ్టన్ సుందర్ చికాకుపడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తన చుట్టూ ఆసక్తిగా ఉన్న అభిమానుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ.. సెల్ఫీలు ఇవ్వడానికి నిరాకరించాడు. రోహిత్, కోహ్లి కంటే గొప్పోడా..దీంతో చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో వాషింగ్టన్ సుందర్ వైఖరిని ప్రశ్నించారు. కొందరు అయితే, వాషింగ్టన్ సుందర్.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య వంటి వారి కంటే తనను తాను గొప్ప వ్యక్తిగా భావిస్తున్నాడా అని ఫైర్ అయ్యారు. మరో యూజర్ స్పందిస్తూ.. టూ మచ్ యాట్టిట్యూట్ అని కామెంట్ పెట్టాడు. గౌతమ్ గంభీర్ స్టార్ కల్చర్‌ను దూరం పెట్టాలని చెప్పినందుకే.. సుందర్ అలా ప్రవర్తించి ఉంటాడని ఫన్నీగా కామెంట్ పెట్టాడు మరో యూజర్. కాగా, ఈ సంఘటన మరో చర్చకు దారితీసింది. లీజర్ టైమ్ ఎంజాయ్ చేస్తున్న ఆటగాళ్లకు కూడా వ్యక్తిగత గోప్యత హక్కు ఉంటుందని పలువురు వాదిస్తున్నారు. ఆ సమయంలో సుందర్‌ను అభిమానులు సెల్ఫీల కోసం ఇబ్బంది పెట్టకపోయి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు, ఎంత సెలబ్రిటీలు అయినా.. ప్రవర్తించే తీరు ఉంటుంది అని అంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో గతంలో కొందరు సెలబ్రిటీలు స్పందించిన తీరును ఉదహరిస్తున్నారు. కాగా, త్వరలో ఆలౌరౌండర్ వాషింగ్టన్ సుందర్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో అనే ఆసక్తి నెలకొంది.