: భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. వీలైనంత మేరకు బంగారం కొనుగోలు చేస్తూనే ఉంటారు. అందుకే మన దేశంలోకి బంగారం దిగుమతి భారీగా అవుతుంది. దేశ ప్రజల వద్ద ఉన్న బంగారం విలువ జీడీపీ కంటే అధికంగా ఉంటుందట. తమ వద్ద ఎంత బంగారం ఉంటే అంత గౌరవంగా భావిస్తారు. ఇటీవలి కాలంలో బంగారంలో పెట్టుబడులు సైతం భారీగా పెరుగుతున్నాయి. అలాగే సైతం అంతకు మించి పెరుగుతున్నాయి. ఈ 2025లో బంగారం ధరలు రెండింతలయ్యాయి. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు, అమెరికా సుంకాలు, ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంటూ ఎన్నో కారణాలు బంగారం రేట్లు పెరిగేందుకు దోహదపడుతున్నాయి. అయితే, ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు, మదుపరుల లాభాల స్వీకరణతో పసిడి రేట్లు భారీగా తగ్గాయి. దీంతో చాలా మంది బంగారం కొనేందుకు సిద్ధమయ్యారు. అయితే వారందరికీ ఊహించని షాక్ తగిలింది. మూడు రోజులుగా తగ్గిన బంగారం ధరలు ఇవాళ ఒక్కసారిగా పెరిగాయి. కానీ, వెండి రేటు మాత్రం దిగివచ్చింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు ఏకంగా 17 డాలర్ల మేర పెరిగింది. దీంతో ఔన్స్ గోల్డ్ రేటు 4345 డాలర్ల స్థాయికి ఎగబాకింది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు దాదాపు 2 శాతం పెరిగింది. దీంతో ఔన్స్ సిల్వర్ రేటు 72.66 డాలర్ల వద్దకు చేరి ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో బంగారం ధరలుహైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరల గత మూడు రోజులుగా దాదాపు రూ.7500 మేర తగ్గాయి. అయితే, మళ్లీ తగ్గుతాయని భావించిన వారికి ఊహించని షాక్ తగిలింది. ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. గోల్డ్ రేట్లు మళ్లీ పెరిగాయి. ఈరోజు 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములపై రూ. 150 మేర పెరిగింది. దీంతో తులం బంగారం రేటు రూ.1,23,800 వద్దకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రేటు తులానికి ఈరోజు రూ.170 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల రేటు రూ.1,35,060 వద్దకు చేరింది. రూ.1000 తగ్గిన వెండిఈరోజు మరింత తగ్గింది. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.1000 మేర తగ్గింది. దీంతో కిలోకు రూ. 1,56,000 స్థాయికి దిగివచ్చింది. పైన చెప్పిన బంగారం, వెండి రేట్లు జనవరి 2వ తేదీ శుక్రవారం రోజు ఉదయం 7 గంటలకు ఉన్నవి. అయితే, మధ్యాహ్నానికి ధరలు మారవచ్చు. ట్యాక్సుల కారణంగా ప్రాంతాలను బట్టి బంగారం ధరలు వేరు వేరు ఉంటాయి. కొనే ముందు స్థానికంగా తెలుసుకోవడం మంచిది.