విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమాన ప్రయాణానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. తొలి విమానం జనవరి 4, 2026న ల్యాండ్ కానుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు భాగస్వామ్యం అవుతున్నారు. వీరిద్దరు జనవరి 4న ఢిల్లీ నుంచి తొలి విమానంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు రానున్నారు. ఈ విమానాశ్రయం భవిష్యత్తులో అంతర్జాతీయ విమాన సర్వీసులకు కీలక కేంద్రంగా మారనుంది. నిర్మాణ పనులు వేగంగా జరుగుతుండగా.. రన్‌వే, టెర్మినల్ భవనాలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, భద్రతా వ్యవస్థ వంటి ముఖ్యమైన పనులు చివరి దశకు చేరుకున్నాయి.భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్ అయ్యేందుకు అధికారులు అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది భోగాపురం విమానాశ్రయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఈ విమానాశ్రయం భవిష్యత్తులో అంతర్జాతీయ విమాన సర్వీసులకు ఒక ముఖ్యమైన ముందడుగు అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం విమానాశ్రయ నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ద్వారా అంతర్జాతీయ విమాన సేవలు అందుబాటులోకి రావడం, ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు. పనులు వేగంగా జరుగుతున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు మరికొద్ది నెలల్లో పూర్తికానున్నాయి. 2026 మే నెల నుంచే విమాన రాకపోకలు సాగించేలా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా జనవరిలో టెస్టింగ్‌ ఫ్లైట్‌ ఎగరనుంది. ఇప్పటికే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో టెస్టింగ్‌ రైడ్‌లో ఇప్పటికే చిన్న విమానాల ద్వారా ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ ద్వారా విమానాశ్రయం పనితీరును పరిశీలిస్తారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో అందుబాటులోకి రానుంది. ఇది ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఉత్తరాంధ్రకు కీలకంగా మారనుంది.. వచ్చే ఏడాది విమాన సర్వీసులు ప్రారంభంకానున్నాయి. వచ్చే ఏడాది ఆగస్టుకు పనులు పూర్తి చేస్తామని గతంలో ప్రకటించారు.. అలాగే జూన్ నెలకు పూర్తి చేస్తామని ఆ తర్వాత చెప్పారు. అయితే ఇటీవల కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్ని కుదిరితే మే నెలలోనే ప్రారంభిస్తామన్నారు.