ప్రస్తుతం జరుగుతున్న దేశవాళీ టోర్నమెంట్.. ఆటగాళ్ల ప్రదర్శనను బీసీసీఐ సెలెక్టర్లు నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. జాతీయ జట్టులోకి తీసుకునే విషయమై వారి ప్రదర్శనను విశ్లేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమ ఫామ్‌ను నిరూపించుకునేందుకు, సెలెక్టర్ల కళ్లలో పడేందుకు.. జట్టుకు దూరమైన కొందరు ప్లేయర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. అయితే భారత్ వన్డే జట్టులో బెర్త్ కోసం పోటీ పడుతున్న వారిలో దేవ్‌దత్ పడిక్కల్ కూడా ఉన్నాడు. ఇతడు మళ్లీ జట్టులోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ డొమెస్టిక్ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. బీసీసీఐ సెలెక్టర్లకు డైరెక్ట్ మెసేజ్.. ఈ విజయ్ హజారే ట్రోఫీలో.. నాలుగు మ్యాచ్‌ల్లోనే 3 . దీంతో వన్డే జట్టు బెర్త్ రేసులో తాను కూడా ఉన్నట్లు సెలక్టర్లకు డైరెక్ట్ మెసేజ్ ఇచ్చాడు. డిసెంబర్ 31న పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో పడిక్కల్ 116 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 113 పరుగులు చేశాడు. అంతకుముందు ఝార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 118 బంతుల్లో 147 పరుగులు బాదాడు. ఇక కేరళపై 137 బంతుల్లో 124 పరుగులు బాది.. తన స్థిరమైన ఫామ్‌ను ప్రదర్శించాడు. ఇక తమిళనాడుతో 12 బంతుల్లో 22 పురుగులు చేశాడు. ఈ మొత్తం 4 మ్యాచ్‌ల్లో దేవదత్ పడిక్కల్ 405 పరుగులు చేయడం గమనార్హం.ఈ నాలుగు మ్యాచ్‌ల్లోనే పడిక్కల్‌ నిలకడగా ఆడాడు. ఒత్తిడిలోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో త్వరలో న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు పడిక్కల్ సెలెక్ట్ అవుతాడని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. క్రికెట్ విశ్లేషకులు కూడా.. ఇతడిని సెలక్టర్లు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే సెలెక్టర్లు ఇతడిని పరిగణలోకి తీసుకోవడానికి కూడా కారణాలు ఉన్నాయని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. పడిక్కల్ క్రీజులో ఒక్కసారి కుదురుకుంటే.. భారీ ఇన్నింగ్స్‌లు ఆడే సత్తా అతడికి ఉందని అంటున్నారు. చేధనలో కూడా దూకుడుగా ఆడగలడని చెబుతున్నారు.కాగా, దేవదత్‌ పడిక్కల్‌కు లిస్ట్‌-ఎ క్రికెట్‌లో కూడా మంచి రికార్డు ఉంది. కేవలం 36 ఇన్నింగ్స్‌ల్లో 12 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇక టీమిండియా తరఫున ఇప్పటివరకు రెండు టెస్టులు, రెండు టీ20ల్లో పాల్గొన్నాడు. అయితే వన్డేల్లో మాత్రం పడిక్కల్ ఇంకా డెబ్యూ చేయలేదు. 2021లో శ్రీలంక పర్యటనలో ఎంపిక అయినా.. అరంగేట్రం చేయలేకపోయాడు. మరి న్యూజిలాండ్ సిరీస్‌‌కు అయినా ఇతడు ఎంపిక అవుతాడో లేదో చూడాలి. అయితే ఈ వన్డే జట్టులో బెర్త్ కోసం పడిక్కల్‌తో పాటు.. ఇషాన్ కిషన్, ధ్రువ్ జురెల్, మహ్మద్ షమీ, రుతురాజ్ గైక్వాడ్ కూడా పోటీ పడుతున్నారు.