మందు బాబులకు అలర్ట్.. సీపీ సజ్జనార్‌ ఫైనల్ వార్నింగ్.. ఈ మార్గాల్లో నో పర్మిషన్..

Wait 5 sec.

హైదరాబాద్‌లోనూ న్యూ ఇయర్ వేడుకలు ఎంత కోలాహలంగా జరుపుకుంటారో అందరికే తెలిసిందే. డిసెంబర్ 31 సాయంత్రం నుంచే యువత పెద్ద ఎత్తున సందడి చేస్తుంటారు. అర్థరాత్రి 12 గంటలు కాగానే ఒకరినొకరు హత్తుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అయితే నూతన సంవత్సరం రాక నేపథ్యంలో మందు బాబుల జోష్ కూడా జోరుగా ఉంటుంది. సాయంత్రం నుంచి మొదలు పెడితే అర్థరాత్రి వరకు కూడా మద్యం సేవిస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో మందు బాబులకు హైదరాబాద్ ఇచ్చారు.మద్యం తాగి వాహనాలతో రోడ్ల పైకి వస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. నగరంలోని 120 ప్రాంతాల్లో డిసెంబర్ 31న రాత్రి ప్రత్యేక డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపడతామని వెల్లడించారు. మద్యం తాగి పట్టుబడితే భారీ జరిమానాతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని, జైలు శిక్ష కూడా విధిస్తామని చెప్పారు. అంతేకాకుండా డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేసి మళ్లీ రోడ్లపైకి రాకుండా చేస్తామని తెలిపారు. ర్యాష్‌ డ్రైవింగ్‌, పబ్లిక్ ప్రదేశాల్లో న్యూసెన్స్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు సీపీ సజ్జనార్.ఈ మార్గాల్లో వాహనాలకు అనుమతి లేదు.. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు ఫ్లైఓవర్లు మూసివేయనున్నట్లు తెలిపారు. వివిధ మార్గాల్లో భారీ వాహనాల ప్రవేశంపై రాత్రి నుంచి నిషేధం అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలైన ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌రోడ్‌లో వాహనాలను అనుమతించబోమని పోలీసులు చెప్పారు. ఇదే కాకుండా న్యూఇయర్ ఈవెంట్స్‌ జరిగే ప్రాంతాల్లోనూ ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు కానున్నాయి. అలాంటి ఈవెంట్లకు హాజరయ్యే వారు.. ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. కాగా, హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో.. అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక రాత్రి వేల మహిళల భద్రత కోసం షీటీమ్స్‌ సిద్ధంగా ఉంటాయని వెల్లడించారు. మందు బాబులకు ఫ్రీ ట్యాక్సీలు.. కొత్త సవంత్సరం సందర్భంగా చాలా మంది మద్యం సేవించే అవకాశం ఉన్నందున.. జీపీడబ్ల్యుయూ (తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రకటించింది. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా బైక్, క్యాబ్.. వంటి ట్యాక్సీ సేవలు డిసెంబర్ 31 రాత్రి 11:00 గంటల నుంచి జనవరి 1 రాత్రి 1:00 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ , సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధుల్లో ఈ ఉచిత ప్రయాణ సేవలు అందిస్తున్నారు.