కొత్త సంవత్సరం వేళ సామాన్యుడికి బిగ్ షాక్.. పెరిగిన కూరగాయల ధరలు.. వాటి ధర కిలో రూ.400..

Wait 5 sec.

కొత్త సంవత్సరం 2026లోకి మనం ఎంతో ఉత్సాహంగా... కొత్త ఆశలతో అడుగుపెట్టాం. దేశవ్యాప్తంగా ప్రజలందరూ 2025కి వీడ్కోలు పలుకుతూ అర్థరాత్రి వరకు వేడుకల్లో మునిగిపోయారు. అయితే.. ఆ సంబరాలు ముగియకముందే సామాన్యుడిపై ధరల భారం పడింది. కొత్త ఏడాది ప్రారంభంలోనే బడ్జెట్ తలకిందులవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో కూరగాయలు, మాంసం ధరలు సాధారణం కంటే రెట్టింపు అయ్యాయి.సాధారణంగా శీతాకాలంలో కూరగాయల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ధరలు తక్కువగా ఉండాలి. కానీ ఈసారి వాతావరణం అందుకు భిన్నంగా ఉంది. తీవ్రమైన చలి కారణంగా తోటల్లో దిగుబడి గణనీయంగా తగ్గింది. మరోవైపు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుండి రావాల్సిన సరఫరా కూడా తగ్గడంతో మార్కెట్లో డిమాండ్ పెరిగి ధరలు మండిపోతున్నాయి. గతంలో కిలో రూ. 20 పలికిన టమాటా, ఇప్పుడు రూ. 70 దాటిపోయింది. బీర, బెండ, చిక్కుడు వంటి కాయగూరలు కిలో రూ. 80 నుండి రూ. 100 వరకు విక్రయిస్తున్నారు. పచ్చిమిర్చి ధర కూడా సెంచరీ మార్కును తాకింది.కొత్త ఏడాది వేడుకలు, రాబోయే సంక్రాంతి పండుగ రద్దీ కారణంగా చికెన్, మటన్, కోడిగుడ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. .. ప్రస్తుతం రూ. 300 వరకు చేరుకుంది. పలుకుతోంది. పండుగ సీజన్ కావడంతో రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. ఇక వీటిలో మునగకాయలు కిలోకి ఏకంగా రూ.400ల వరకు పలకడం విశేషం. కూరగాయలతో పాటు పండ్ల ధరలు కూడా.. కూరగాయలతో పాటు పండ్ల ధరలు కూడా సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లాయి. శీతాకాలం కావడంతో పండ్ల సరఫరా తగ్గింది. యాలకుల అరటిపండ్లు కిలో రూ. 100 వరకు పలుకుతుండగా.. ఆపిల్స్, ఇతర పండ్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో పండ్లు, పూల ధరలు కూడా పెరగడం మధ్యతరగతి ప్రజలకు భారంగా మారింది.ఆదాయం పెరగకపోయినా.. ఇలా ప్రతికూల వాతావరణం, పండుగల కారణంగా ధరలు పెరగడం సామాన్యులపై ఒత్తిడిని పెంచుతోంది. ఆరోగ్యానికి అవసరమైన ప్రోటీన్ ఆహారం, కూరగాయల కోసం నెలకు కేటాయించే బడ్జెట్ ఇప్పుడు రెట్టింపు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకు నిత్యావసరాలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.