తెలుగు వారికి సంక్రాంతి అతి పెద్ద పండగ. విద్య, ఉద్యోగం, ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన వారు సైతం పండగ పూట ఇంటికి వెళ్లాలని.. సొంతూళ్లలో సంతోషంగా గడపాలని భావిస్తారు. వ్యయప్రయాసాలకోర్చి సంక్రాంతికి ఊరికి వెళ్లాలనుకుంటారు. అయితే సంక్రాంతి సందర్భంగా రైళ్లలో టికెట్లు దొరకడం కష్టంగా ఉంటుంది. ఇక ఇప్పటికే ఉన్న బస్సులు అన్నీ దాదాపు బుక్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో పండక్కి ఏపీ వెళ్లే వారికి తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు టీజీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. బీహెచ్‌ఈఎల్‌ స్పెషల్ బస్సులు..నగరంలోని బీహెచ్‌ఈఎల్‌ డిపో ఆర్సీపురం నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు తెలంగాణ ఆర్టీసీ సిద్ధమైంది. ఆర్సీపురం నుంచి మియాపూర్‌, కేపీహెచ్‌బీ, ఔటర్‌ రింగ్‌ రోడ్‌ మీదుగా.. అమలాపురం, కాకినాడ, నర్సాపురం, విశాఖపట్నం, రాజమండ్రి, పోలవరం, గుంటూరు, చీరాల, విజయవాడతోపాటు తదితర ప్రాంతాలకు బస్సులు నడుపనున్నారు. ఈ మేరకు బీహెచ్‌ఈఎల్‌ డిపో మేనేజర్ సుధా సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆర్సీపురం నుంచి నడిచే అందుబాటులో ఉన్నాయని డిపో మేనేజర్ చెప్పారు. ఈ బస్సుల కోసం ఆన్‌లైన్‌ బుకింగ్‌, ముందస్తు రిజర్వేషన్‌ చేసుకోవచ్చని తెలిపారు. అందుకోసం ఆర్టీసీ వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవాలని చెప్పారు. ఈ స్పెషల్ బస్సులకు సంబంధించి ఇతర సమాచారం కోసం 9959226149 నెంబరుకు కాల్ చేయాలని తెలిపారు. ప్రయాణికుల రద్దీని బట్టి బస్సుల సంఖ్య పెంచేలా ఏర్పాట్లు చేస్తున్నామని డిపో మేనేజర్ వెల్లడించారు. నగర శివారు ప్రాంతాల్లో ఉన్నవారు.. ముఖ్యంగా బీహెచ్ఈఎల్ సమీప ప్రాంతాల్లో ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఆర్టీసీ బస్సుల్లో ముందే టికెట్లు బుక్ చేసుకోవాలి. లేకుంటే చివరి క్షణాల్లో బస్సుల్లో సీట్లు లభించక ఇబ్బంది పడాల్సివస్తుంది. ఆర్టీసీతో పోలిస్తే ప్రైవేటు ట్రావెల్స్ వారు ఎక్కువ ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంది. పడుతున్నాయి. ఓ కుటుంబం మొత్తం ప్రైవేట్ బస్సులో సొంతూరుకు చేరుకోవాలంటే.. వేల రూపాయలు ఖర్చు అవుతోంది. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు టికెట్ రేట్లు పెంచి ప్రయాణికులను భయపెడుతున్నాయని విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయినా ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు తగ్గడం లేదు. పండుగను క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి.