భారత జీడీపీ కంటే.. దేశ ప్రజల దగ్గరున్న బంగారం విలువే ఎక్కువ.. కళ్లు చెదిరే మొత్తం.. లక్షల కోట్లు!

Wait 5 sec.

: బంగారానికి.. భారతీయులకు విడదీయరాని సంబంధం ఉంది. పురాతన కాలం నుంచి భారతీయులకు బంగారం అంటే అమితమైన ఆసక్తి. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాల్ని విశేషంగా కొనుగోలు చేసి ధరిస్తుంటారు. పండగలు, శుభకార్యాలు, వివాహాలు ఇతర ప్రత్యేక సందర్భాల సమయంలో డిమాండ్ మరింత ఎక్కువగా ఉంటుంది. బంగారు ఆభరణాలు మహిళల అందాన్ని మరింత పెంచుతుందని చెబుతుంటారు. సమాజంలో హోదాను కూడా ప్రతిబింబిస్తుంది. అందుకే.. ప్రతి ఇంట్లో ఎంతో కొంత బంగారం ఉంటుంది. అనిశ్చితి, సంక్షోభాల వేళ బంగారం సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పనిచేస్తుందని నమ్ముతారు. అందుకే.. తమ దగ్గర ఉన్న డబ్బుతో చిన్న చిన్న మొత్తాల్లో కూడా కొనుగోలు చేసి కూడబెడుతుంటారు. అయితే ఇప్పుడు భారతీయుల వద్ద ఉన్న .. సరికొత్త మైలురాయిని తాకింది. భారతీయ ప్రజల వద్ద ఉన్న మొత్తం బంగారం విలువ.. ఇప్పుడు భారత స్థూల దేశీయోత్పత్తినే (GDP) మించిందని తెలుస్తోంది. దీంతో ప్రజల ఇంట్లో ఉన్న బంగారం విలువ కూడా విపరీతంగా పెరిగిందని చెప్పొచ్చు. భారతీయ ప్రజల వద్ద సుమారుగా 34 వేల నుంచి 35 వేల టన్నుల వరకు బంగారం నిల్వలు ఉన్నాయని అంచనా.ఇంటర్నేషనల్ మార్కెట్లో కిలో 1,46,000 డాలర్ల మార్కు దాటింది. ఇదే టన్నుకు (1000 కిలోలు) చూస్తే దీని విలువ 14,60,00,000 డాలర్లకు చేరుకుంది. 34,500 టన్నుల బంగారం ధర చూసినా ఇది సుమారు 5 ట్రిలియన్ డాలర్ల మార్కును అధిగమించింది. ట్రిలియన్ అంటే లక్ష కోట్లు. అంటే ప్రజల వద్ద బంగారం విలువ 5 లక్షల కోట్ల డాలర్ల మార్కు దాటేసింది. ఇది భారత కరెన్సీలో చూస్తే సుమారు రూ. 450 లక్షల కోట్లుగా ఉంటుంది. ఇక మన దేశ జీడీపీ 4 ట్రిలియన్ డాలర్లుగా ఉందని అంచనా. ఇది దాదాపు రూ. 360 లక్షల కోట్ల వరకు ఉంటుందని చెప్పొచ్చు. అంటే.. . ఈ అక్టోబర్ నెలలో భారతదేశ జీడీపీలో భారతీయుల దగ్గర ఉన్న బంగారం విలువ 88.8 శాతంగా ఉండగా.. ఇటీవల బంగారం రేట్లు విపరీతంగా పెరగ్గా ఇప్పుడు జీడీపీనే మించిపోయిందని చెబుతున్నారు. భారత్ తమ అవసరాల కోసం, ప్రజల డిమాండ్‌కు తగ్గట్లుగా అందుబాటులో ఉంచేందుకు ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటుందని చెప్పొచ్చు. ఇంకా బంగారాన్ని అత్యధికంగా వినియోగించే దేశాల్లో చైనా తర్వాత రెండో స్థానంలో ఉంది ఇండియా. ప్రజల దగ్గర మాత్రమే కాకుండా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దగ్గర కూడా సుమారు 880 టన్నుల మేర పసిడి నిల్వలు ఉన్నాయి.