నన్ను ప్రెగ్నెంట్ చేస్తే రూ.25 లక్షలు ఇస్తానంటూ మహిళ వీడియో.. బుట్టలో పడ్డ కాంట్రాక్టర్

Wait 5 sec.

సోషల్ మీడియాలో జరుగుతున్న సైబర్ నేరాల గురించి నిత్యం వార్తలు చూస్తున్నప్పటికీ.. కొందరు మాత్రం అవేమీ పట్టించుకోకుండా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని భారీగా డబ్బులు సమర్పించుకుంటున్నారు. రకరకాల ఫేక్ ఆఫర్స్‌కు ఆశపడి.. తమ చేతిలో ఉన్న డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇక అమాయకులకు ఎర వేసేందుకు సైబర్ కేటుగాళ్లు రోజుకో రకమైన ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రెగ్నెంట్ జాబ్ పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక వింత ఆన్‌లైన్ మోసంలో పూణేకు చెందిన 44 ఏళ్ల కాంట్రాక్టర్ బాధితుడు అయ్యాడు. డబ్బు ఆశతో వెళ్లిన ఆ కాంట్రాక్టర్.. రూ. 11 లక్షలు పోగొట్టుకున్నాడు.సెప్టెంబర్ నెల మొదట్లో సోషల్ మీడియాలో ప్రెగ్నెంట్ జాబ్ అనే కంపెనీకి చెందిన వీడియో ప్రకటనను చూశాడు. ఆ వీడియోలో ఒక మహిళ హిందీలో మాట్లాడినట్లు ఉంది. తనకు తల్లి కావడానికి ఒక వ్యక్తి కావాలని.. అందుకోసం తనకు రూ. 25 లక్షలు ఇస్తానని పేర్కొంది. అంతేకాకుండా.. ఆ వ్యక్తికి విద్య, కులం, రూపం గురించి తాను పట్టించుకోనని చెప్పింది.ఆ వీడియో చూసి ఆఫర్‌ బాగుందని భావించిన ఆ కాంట్రాక్టర్.. అందులో ఇచ్చిన ఫోన్ నంబర్‌కు కాల్ చేశాడు. ఇక కాల్ లిఫ్ట్ చేసిన సైబర్ నేరగాళ్లు తమ ప్లాన్‌ను పక్కాగా అమలు చేశారు. తాను ప్రెగ్నెంట్ జాబ్ సంస్థ సహాయకుడిని అని పరిచయం చేసుకున్నాడు. ఆ ఉద్యోగాన్ని ఇవ్వాలంటే ముందుగా రిజిస్ట్రేషన్, ఐడీ కార్డ్ వంటివి పొందడం తప్పనిసరి అని చెప్పాడు. ఇందుకోసం కొంత డబ్బు ఖర్చు అవుతుందని కూడా వెల్లడించాడు.ఆ తర్వాత వారాల్లో.. సైబర్ మోసగాళ్లు వివిధ రకాల ఫార్మాలిటీల పేరుతో ఆ కాంట్రాక్టర్ నుంచి డబ్బులు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. అందులో రిజిస్ట్రేషన్ ఫీజులు, ఐడీ కార్డ్ ఛార్జీలు, వెరిఫికేషన్, జీఎస్‌టీ, టీడీఎస్, ప్రాసెసింగ్ ఫీజులు వంటి పేరుతో పలుమార్లు అతడితో డబ్బులు కట్టించుకున్నారు. ఇలా సెప్టెంబర్ నెల మొదటి నుంచి అక్టోబర్ 23వ తేదీ వరకు.. ఆ బాధితుడు యూపీఐ, ఐఎంపీఎస్ ద్వారా 100 కంటే ఎక్కువ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు చేశాడు. అవన్నీ కలిపి మొత్తం రూ. 11 లక్షల వరకు సైబర్ నేరగాళ్లు ఆ కాంట్రాక్టర్ నుంచి డబ్బులను గుంజారు.ఇక బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు విచారణ సందర్భంగా పోలీసులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇలాంటి కేసుల్లో పోలీసులు పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మోసాలు సోషల్ మీడియా, నకిలీ వీడియో ప్రకటనలను ఉపయోగించి బాధితులను ఆకర్షించే విస్తృత సైబర్‌క్రైమ్ నెట్‌వర్క్‌లో భాగమని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై బనేర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.సైబర్ మోసాల నుంచి రక్షణకు సూచనలుడబ్బు, మరీ ముఖ్యంగా పెద్ద మొత్తంలో సులభంగా ఇస్తామనే అసాధ్యమైన వాగ్దానాలను ఎప్పుడూ నమ్మకండని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. ఉద్యోగం లేదా సర్వీసుల కోసం ముందస్తుగా రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్, జీఎస్టీ వంటి ఫీజులు అడిగితే అది మోసం అని గుర్తించాలని పేర్కొంటున్నారు. ఏదైనా తెలియని లేదా కొత్త కంపెనీల గురించి ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసిన తర్వాతే ముందుకు వెళ్లాలని చెబుతున్నారు.