HMDA పరిధిలో మరో 3 కొత్త రైల్వేటెర్మినల్స్.. ఆ ఏరియాల్లోనే

Wait 5 sec.

నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. విద్య ఉద్యోగ అవకాశాల నిమిత్తం పట్టణానికి వచ్చే సంఖ్య భారీగా పెరుగుతోంది. అలానే నగరంలోకి రాకపోకలు కూడా అదే స్థాయిలో సాగుతున్నాయి. ఈక్రమంలో కి పెరుగుతున్న రైళ్ల రాకపోకలు, రద్దీని దృష్టిలో పెట్టుకుని.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ది. ఈమేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు రూపొందించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ఇందులో భాగంగా ట్రిపుల్ ఆర్, ఓఆర్ఆర్ మధ్య కొత్త రైల్వే టెర్మినల్స్ నిర్మించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఉన్న సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, చర్లపల్లి, లింగంపల్లిలో ఉన్న టెర్మినల్స్‌పై భారీగా ఒత్తిడి ఉంది. రద్దీని దృష్టిలో పెట్టుకునే కొన్నాళ్ల క్రితమే చర్లపల్లి టెర్మినల్ నిర్మించారు. అయినప్పటికీ కూడా ఇతర మెట్రోనగరాల నుంచే కాకుండా వేర్వేరు ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చే రైళ్లను, ఇప్పుడున్న టెర్మినల్స్‌లో నిలిపేందుకు తగినన్ని ప్లాట్‌ఫారాలు లేక కొన్నింటిని శివారు ప్రాంతాలకే పరిమితం చేయాల్సి వస్తోంది. దీనికి తోడు భాగ్యనగరం కూడా విస్తరిస్తుండటం.. జనాభా భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. నగరానికి వచ్చే రైల్వే ప్రయాణికుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ చుట్టూ కొత్తగా మూడు టెర్మినల్స్ నిర్మిస్తే.. ప్రయాణికులు ఒత్తడిని తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించే అవకాశం ఉంది. అలానే 2047 నాటికి హైదరాబాద్ నగర జనాభా 3 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బల్దియా పరిధిలో 1.13 కోట్ల జనాభా ఉండగా.. మరో ఆరు సంవత్సరాల్లో అనగా 2031 నాటికి 1.84 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం తూర్పున వరంగల్ రూట్‌లో చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ని నిర్మించిన రైల్వేశాఖ సిటీకి వెస్ట్ సైడ్ శంకర్ పల్లి సమీపంలోని నాగులపల్లిలోనూ, నార్త్ వైపు మేడ్చల్ అవతల డబీర్ పూర్ వద్ద, దక్షిణ దిశగా బెంగళూరు రూట్లో శంషాబాద్ సమీపంలో జుక్కల్ వద్ద రైల్వే టెర్మినల్స్ నిర్మించాలని భావిస్తోంది. ఈ టెర్మినల్స్ పూర్తిచేస్తే ఇప్పటికే ఉన్న టెర్మినల్స్ మీద ఒత్తిడి తగ్గి, గ్రేటర్ రైల్వే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పుతాయని భావిస్తున్నారు. ప్రస్తుతం అధికారులు కొత్త రైల్వే టెర్మినల్స్‌కు అవసరమైన భూములను సేకరించే పనుల్లో తలమునకలయ్యారు. నాగులపల్లి వద్ద నిర్మించే టెర్మినల్ కోసం.325 ఎకరాల భూమి అవసరం ఈటెర్మినల్లో 20 ప్లాట్‌ఫారాలు, 14 పిట్లైన్స్,24 స్టేబ్లింగ్‌లైన్లు నిర్మించనున్నారు.డబీర్‌పూర్ వద్ద నిర్మించే టెర్మినల్ కోసం250 ఎకరాలు భూమి అవసరంఈ టెర్మినల్లో 14 ప్లాట్ఫారాలు, 10 పిట్లైన్స్, 14 స్టేబ్లింగ్‌లైన్లు జుక్కల్ టెర్మినల్ నిర్మాణం కోసం300 ఎకరాల భూమి అవసరం కాగా, 18 ప్లాట్ఫారాలు, 12పిట్లైన్స్, 20 స్టేబ్లింగ్‌లైన్లు నిర్మించనున్నట్టు అధికారులు వెల్లడించారు.