ఓట్ల కోసం భార్యను కూడా సీఎం ఫ్రీగా ఇవ్వొచ్చు.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Wait 5 sec.

మహిళలను ఉచిత పథకాలతో పోల్చుతూ తమిళనాడు మాజీ మంత్రి రాజ్యసభ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఓట్ల కోసం ఉచితంగా భార్యలను కూడా ఇవ్వవచ్చని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే బూత్ కమిటీ శిక్షణా కార్యక్రమంలో షణ్ముగం మాట్లాడుతూ.. ‘ఎన్నికల కోసం చాలా హామీలు గుప్పిస్తారు. మిక్సర్లు, గ్రైండర్లు, మేకలు, ఆవులు ఫ్రీగా ఇస్తామని చెబుతారు.. అంతేకాదు, ప్రతి వ్యక్తికి ఒక భార్యను కూడా ఫ్రీగా ఇవ్వవచ్చు’ అంటూ నోరుజారారు. చేయగల సామర్థ్యం ఉందని షణ్ముగం వ్యాఖ్యానించారు..షణ్ముగం వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలను కించపరిచేలా ఆయన చేసిన వ్యాఖ్యలను అధికార డీఎంకే తీవ్రంగా ఖండించింది. మహిళా మంత్రి తిరుమిగు గీతా జీవన్ ఘాటుగా స్పందించారు. షణ్ముగం వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. మహిళల పట్ల వికృత దురుద్దేశాన్ని బయటపెట్టాయని ఆరోపించారు. మహిళా సాధికారత కోసం తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మంత్రి గీతా ఈ సందర్భంగా హైలైట్ చేశారు. విడియల్ పయనం (ఉచిత బస్సు), కలైంజర్ మహిళా హక్కుల పథకం, పుదుమై పెణ్ పథకం (వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్) వంటి పథకాలను మహిళల కోసం అమలు చేస్తున్నామని తెలిపారు. డ్వాక్రా మహిళలకు రుణ పరిమితి పెంపు, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే పథకాలను అమలు చేస్తోందని వివరించారు. మహిళా వర్గాన్ని షణ్ముగం కించపరిచారని గీతా జీవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత జయలలిత బతికుంటే షణ్ముగం ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారా? అని ప్రశ్నించారు. అన్నాడీఎంకే అధ్యక్షుడు పళనిసామి ఈ వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదని ఆమె నిలదీశారు.గతంలో మహిళా సంక్షేమ పథకాలను అన్నాడీఎంకే నేతలు కించపరిచిన సందర్భాలను గీతా జీవన్ గుర్తు చేశారు: ఉచిత బస్సు ప్రయాణాన్ని ‘లిప్‌స్టిక్ పూసిన బస్సులు’ అని పళనిసామి పోల్చారని ఆమె తెలిపారు. అలాగే, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, నటి ఖుష్బూ మహిళా హక్కుల పథకాన్ని ‘భిక్షం’ అని అభివర్ణించారని, పీఎంకే నాయకురాలు సౌమ్య అన్బుమణి మహిళలకు అందించే రూ.1,000 సహాయాన్ని ఎగతాళి చేశారని మండిపడ్డారు. నాయకత్వంలోని తమ సర్కారు రాష్ట్రంలో ప్రగతిశీల పథకాలను అమలు చేస్తోందని, ఇది మహిళల ఆర్థిక స్వావలంభన, విద్యలో భాగస్వామ్యం, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచిందని డీఎంకే ఓ ప్రకటన తెలిపింది. ఈ అభివృద్ధి అన్నాడీఎంకేకు నచ్చడం లేదని, అందుకే షణ్ముగం అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ ప్రకటన పేర్కొంది.