IPS పురాణ్ కుమార్ కేసులో బిగ్ ట్విస్ట్.. తుపాకీతో కాల్చుకుని దర్యాప్తు అధికారి ఆత్మహత్య.. మళ్లీ మొదటికొచ్చింది..!

Wait 5 sec.

హర్యానాలో న సంగతి తెలిసిందే. ఆయన మృతదేహానికి ఇంకా అంత్యక్రియలు నిర్వహించలేదు. ఆయన భార్య ఐఏఎస్ అధికారి అమ్నీత్ కుమార్ పోస్టుమార్టానికి అనుమతి ఇవ్వడం లేదు. ఈ ఘటన హర్యానాలో రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా ఈ కేసు అనూహ్య మలుపు తిరిగింది. పూరణ్ కుమా‌ర్‌పై నమోదైన అవినీతి కేసు విచారణ బృందంలో ఉన్న అసిస్టెంట్ సబ్-ఇన్స్‌పెక్టర్ (ఏఎస్ఐ) సందీప్ కుమార్.. మంగళవారం (అక్టోబర్ 14) తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు సందీప్ కుమార్ సూసైడ్ లెటర్‍తో పాటు ఓ వీడియోను రికార్డు చేశాడు. నిజం కోసం తన ప్రాణాలను త్యాగం చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. అయితే హర్యానా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో వరుస ఆత్మహత్యలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 'అవినీతికి భయపడే పురాణ్ కుమార్ ఆత్మహత్య..'రోహ్‍తక్ సైబర్ సెల్‍లో ఏఎస్ఐగా పని చేస్తున్న సందీప్ కుమార్.. రోహ్‌తక్‌లోని ఒక పొలంలో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు పేజీల సూసైడ్ నోట్‌ను రాశాడు. అందులో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఐపీఎస్ పురాణ్ కుమార్‍పై సంచలన ఆరోణలు చేశాడు. ఆయన అవినీతిపరుడని, తన అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని పురాణ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు గుప్పించాడు. అంతేకాకుండా పురాణ్ కుమార్ జాతి వివక్షతో వ్యవస్థను హైజాక్ చేశారని అన్నాడు. 'ఆయన అవినీతి చాలా లోతుగా ఉంది..'రోహ్‍తక్ రెంజ్‍లో నియమితులయ్యాక పురాణ్ కుమార్ నిజాయితీపరులైన పోలీసు అధికారుల స్థానంలో.. అవినీతిపరులను నియమించుకోవడం స్టార్ట్ చేశాడని లేఖలో పేర్కొన్నాడు. వీరంతా ఫైళ్లను బ్లాక్ చేసి.. పిటిషనర్లకు ఫోన్ చేసి మానసికంగా హింసించి.. డబ్బు అడిగారని సందీప్ కుమార్ ఆరోపించాడు. ఇంక ట్రాన్స్‌ఫర్లకు ప్రతిగా.. మహిళా పోలీసు సిబ్బందిని లైంగికంగా దోపిడీ చేశారని సంచలన ఆరోపణలు గుప్పించాడు. పూరణ్ అవినీతి మూలాలు చాలా లోతుగా ఉన్నాయని.. తనపై వచ్చిన ఫిర్యాదుకు భయపడి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని సందీప్ కుమార్ లేఖలో పేర్కొన్నాడు. దానికి కులం రంగు పులమడానికి ప్రయత్నించి ఆత్మహత్య చేసుకున్నాడన్నాడు. అక్టోబర్ 7న పురాణ్ కుమార్ తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆ నోట్‌లో.. తాను ఉద్యోగం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పురాణ్ పేర్కొన్నారు. హర్యానా పోలీసు డిపార్ట్‌మెంట్‌లో కుల వివక్ష ఉందని.. 16 ఐపీఎస్ అధికారుల పేర్లను లేఖలో ప్రస్తావించారు. గతంలో సొంత డిపార్ట్‌మెంట్‌పైనే అనేక సార్లు పోరాటం చేసిన పురాణ్ కుమార్ ఆత్మహత్యపై అనుమానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏఎస్‌ఐ సందీప్ కుమార్ ఆత్మహత్యతో.. ఈ కేసులో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.