'అవుట్ అయ్యాడుగా.. ఇక డ్రామా స్టార్ట్ చేస్తాడయ్యా' మైక్ ఆన్‌లో ఉందని మరచిపోయి బాబర్ ఆజామ్‌పై పాక్ మాజీ కెప్టెన్ కామెంట్స్!

Wait 5 sec.

పై ఆ దేశ మాజీ క్రికెటర్లకు పీకల వరకూ కోపం ఉందని మరోసారి నిరూపితమైంది. టీ20ల నుంచి తప్పించినా.. మిగతా ఫార్మాట్లలో కూడా తప్పించే వరకూ ఊరుకునేలా లేరు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో బాబర్ అవుటైన తర్వాత చేసన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తక్కువ రన్స్ చేసి అవుటయ్యాడుగా ఇక డ్రామా స్టార్ట్ చేస్తాడు చూడండంటూ కామెంట్రీ చెబుతున్న సమయంలో.. మైక్ ఆన్‌లో ఉందన్న సంగతి మరచిపోయి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వివాదాస్పదమైంది. లాహోర్‌ గడాఫీ స్టేడియంలో పాకిస్తాన్‌ - దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మాజీ కెప్టెన్‌, పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డ్‌ మాజీ చైర్మన్‌ రమీజ్‌ రాజా చేసిన వ్యాఖ్య పెద్ద వివాదంగా మారింది. మొదటి రోజు, 49వ ఓవర్‌ తొలి బంతి‌కి బాబర్‌ ఆజమ్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా రమీజ్‌ మైక్‌ ఆన్‌గా ఉందని గుర్తించకుండా “ఇదిగో అవుట్‌.. ఇప్పుడు డ్రామా చేస్తాడు” అంటూ కామెంట్స్ చేశాడు.సెనురాన్‌ ముతుసామి బంతికి బాబర్‌ క్యాచ్‌ అవుట్ అవ్వగా.. వెంటనే అతను డీఆర్ఎస్ కోరాడు. అయితే రీప్లేల్లో బ్యాట్‌ నుంచి ఎడ్జ్‌ రాకపోవడంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఈ సమయంలో రమీజ్‌ రాజా చేసిన వ్యాఖ్య లైవ్‌ ఆడియోలో వినిపించడంతో సోషల్‌ మీడియాలో విస్తృతంగా వైరల్‌ అయ్యింది.ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ 2 పరుగులకే అవుటయినా ఇమామ్‌ ఉల్‌ హక్‌ (93), షాన్‌ మసూద్‌ (76) రాణించి 161 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభం ఇచ్చారు. టాప్ ఆర్డర్ వరుస వికెట్లు కోల్పోయి 163/1 నుంచి 199/5కి పాక్ టాప్ ఆర్డర్ కూలిపోయింది. బాబర్‌ ఆజమ్‌ ఈ దశలో జట్టును నిలబెట్టే ప్రయత్నం చేశాడు కానీ 48 బంతుల్లో 23 పరుగులకే అవుటయ్యాడు.ఆ తర్వాత మొహమ్మద్‌ రిజ్వాన్‌ (62 నాటౌట్‌), సల్మాన్‌ ఆఘా (52 నాటౌట్‌) లు స్థిరంగా ఆడుతూ తొలి రోజు ముగిసే సమయానికి జట్టును 313/5 స్కోరుకు చేర్చారు. ఈ సిరీస్‌కు సఫారీలను డబ్ల్యూటీసీ ఛాంపియన్‌గా నిలిపిన టెంబా బవుమా దూరంగా ఉండటంతో ఎయిడెన్ మర్కరమ్ సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. ఈ సిరీస్‌తో పాకిస్తాన్‌ 2025–27 వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించింది.