ఈసారి మద్యం షాపుల టెండర్ల ప్రక్రియ మందకోడిగా సాగుతోంది. గతంతో పోలిస్తే తక్కువ సంఖ్యలో అప్లికేషన్లు వస్తున్నాయి. వేల సంఖ్యలో దరఖాస్తుల నుంచి.. ప్రస్తుతం వందలకు పరిమితమవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఇలాంటి పరిస్థితే కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలో.. క్రితం సారి కంటే మద్యం టెండర్లలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ పరిస్థితికి పలు కారణాలు ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.రాష్ట్ర ఖజానాకు మద్యం టెండర్ల ద్వారా గణనీయమైన ఆదాయం వస్తుంది. పా రాష్ట్రంలోని మొత్తం 2,620 మద్య షాపులకు . ఈ షాపులకు మొత్తం 1,31,954 అప్లికేషన్లు వచ్చాయి. ఒక్కో మద్యం షాపునకు వేలల్లో దరఖస్తులు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో 32 మద్యం షాపులు ఉన్నాయి. అప్లికేషన్లు మొదలై 15 రోజులు దాటినా.. ఇప్పటివరకు దాదాపు 50 దరఖాస్తులే వచ్చాయి. ఇక ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 2023లో 8,128 అప్లికేషన్లు రాగా.. ఈసారి ఇప్పటివరకు కేవలం 278 అప్లికేషన్లు రావడం గమనార్హం. వనపర్తి జిల్లాలో ఉన్న 36 మద్యం షాపులకు 20 మంది మాత్రమే టెండర్లు వచ్చాయి. కాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ అలాంటి పరిస్థితే ఉంది. మొత్తం 287 వైన్స్‌లకు గానూ 315 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. క్రితం సారి ఈ జిల్లాలో 10, 734 టెండర్లు రావడం గమనార్హం. ఉమ్మడి మెదక్ జిల్లాలో 243 మద్య దుకాణాలకు ఇప్పటివరకు 411 అప్లికేషన్లు వచ్చాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.మద్యం దుకాణాలకు దరఖాస్తులు సమర్పించడానికి అక్టోబర్ 18వరకు గడువు ఉంది. అక్టోబర్ 23న మద్యం షాపులకు డ్రా తీయనున్నారు. కాగా ఇంకా ఆరు రోజులే సమయం ఉన్నప్పటికీ వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపకపోడవం గమనార్హం. మరోవైపు.. గడువు దగ్గర పడుతుండటంతో.. టెండర్ల సంఖ్య పెంచేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు. గతంలో టెండర్లు వేసిన వారికి పోన్ చేసి మరీ వివరిస్తున్నారు. ముహూర్తాలు, తిథుల గురించి ఎక్సైజ్ సిబ్బంది స్టేటస్‌లు కూడా పెడుతుండటం గమనార్హం. అప్లికేషన్లు తగ్గడానికి కారణాలివే..!దరఖాస్తు ఫీజు రెండు నుంచి మూడు లక్షలకు చేయడంతో.. టెండర్లు వేయడానికి చాలా మంది ఆసక్తి చూపడం లేదని కొందరు వ్యాపారులు చెబుతున్నారు. ఇక టెండర్ల సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ కూడా రావడం కూడా ఒక కారణమని మరికొందరు చెబుతున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడటంతో దరఖాస్తులు పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే చివరి నాలుగు రోజుల్లో చాలా మంది టెండర్లు వేసే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.