చైనాకు ధీటుగా మాస్టర్ ప్లాన్.. రూ.6.4 లక్షల కోట్లతో భారత్ భారీ ప్రాజెక్ట్..!

Wait 5 sec.

దేశీయ అవసరాలకు సరిపడే విద్యుత్‌ను చేసేలా కేంద్ర ప్రభుత్వం భారీ ప్రణాళికను రూపొందించింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (CEA) వెల్లడించిన వివరాల ప్రకారం.. 20247 నాటికి బ్రహ్మపుత్రా నదీ పరీవాహక ప్రాంతం నుంచి 76 గిగావాట్లకు పైగా జలవిద్యుత్‌‌ను ఉత్పత్తి చేసి, దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు రూ.6.4 లక్షల కోట్ల విలువైన భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ నివేదికను సోమవారం విడుదల చేసిన సీఈఏ.. ఈశాన్య రాష్ట్రాల్లోని 12 పరివాహక ప్రాంతాల్లో 208 భారీ హైడ్రో ప్రాజెక్ట్‌లు నిర్మించనున్నట్టు తెలిపింది. వీటి ద్వారా 64.9 గిగావాట్ల విద్యుత్, పంపింగ్ స్టోరేజ్ ప్లాంట్ల ద్వారా అదనంగా మరో 11.1 గిగావాట్ల విద్యుత్‌ కలిపి మొత్తం 76 గిగావాట్లు ఉత్పత్తి చేయనున్నట్టు తెలిపింది.హిమాలయాల్లోని టిబెట్‌లో పుట్టి చైనా, భారత్, బంగ్లాదేశ్‌లో ప్రవహించే బ్రహ్మపుత్ర నది. భారత్‌లోని ముఖ్యంగా చైనా సరిహద్దులోని అరుణాచల్ ప్రదేశ్‌లో గణనీయమైన జలశక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. బ్రహ్మపుత్రా పరీవాహక ప్రాంతం అంతర్జాతీయ సరిహద్దుల్లో, చైనాకు సమీపంగా ఉండటం వల్ల నీటి నిర్వహణ, మౌలిక వసతుల ప్రణాళిక భారత్‌కు వ్యూహాత్మకంగా మారింది. వల్ల వేసవికాలంలో ప్రవాహం దాదాపు 85 శాతం వరకు తగ్గిపోయే ప్రమాదం ఉందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. చైనా నిర్మిస్తోన్న ఈ విద్యుత్ ప్రాజెక్ట్ సామర్థ్యం ఏకంగా 60,000 మెగావాట్లు.నివేదిక ప్రకారం అరుణాచల్ ప్రదేశ్, అసోం, సిక్కిమ్, మిజోరామ్, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, పశ్చిమ్ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. భారత్‌లో వినియోగంలో లేని 80 శాతం జలవిద్యుత్ శక్తి సామర్థ్యం కలిగి ఉండగా.. ఒక్క అరుణాచల్‌లోనే 52.2 గిగావాట్ల సామర్థ్యం ఉండటం చెప్పుకోదగ్గ అంశం. ఈ ప్రణాళిక మొదట దశ (2035 నాటికి)కు రూ.1.91 లక్షల కోట్లు, రెండో దశకు రూ.4.52 లక్షల కోట్లు ఖర్చవుతుంది.ఈ ప్రణాళికలో నేషనల్ హైడ్రో-ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC),నార్త్-ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NEEPCO), సట్లెజ్ జలవిద్యుత్ నిగమ్ (SJVN) వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను కేటాయించిన ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే అమల్లో ఉన్నాయి. కాగా, 2030 నాటికి 500 గిగావాట్ల కర్బన రహిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని, 2070 నాటికి కర్బన రహిత ఉద్గారాలను సాధించాలనే లక్ష్యంగా పెట్టుకుంది.