ముగిసిన నోబెల్ విజేతల ప్రకటన.. ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి పురస్కారం

Wait 5 sec.

గతవారం ప్రారంభమైన నోబెల్ బహుమతుల ప్రకటన నేటితో ముగిసింది. చివరగా ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాదికి గానూ నోబెల్ బహుమతి గెలుచుకున్న విజేతల పేర్లను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌ ప్రకటించింది. ఈ ఏడాదికి గానూ ఎకనామిక్స్‌ విభాగంలో మొత్తం ముగ్గురికి నోబెల్ బహుమతులు దక్కాయి. జోయల్ మోకిర్, ఫిలిప్ అగియోన్, పీటర్ హోవిట్‌లు ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఇక వీరందరికీ డిసెంబర్ 10వ తేదీన నోబెల్ బహుమతుల ప్రదానం జరగనుంది. జోయెల్ మోకిర్, ఫిలిప్ అగియోన్, పీటర్ హోవిట్‌లు.. అర్థశాస్త్రంలో చేసిన విశేష కృషిని గుర్తించి.. ఈ పురస్కారాన్ని అందించనున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది. 'ఆవిష్కరణ-ఆధారిత ఆర్థిక వృద్ధిని వివరించినందుకు'.. 'సాంకేతిక పురోగతి ద్వారా స్థిరమైన వృద్ధికి ముందస్తు అవసరాలను గుర్తించినందుకు'.. 'సృజనాత్మక విధ్వంసం ద్వారా స్థిరమైన వృద్ధి సిద్ధాంతం కోసం' ఈ ముగ్గురు చేసిన సేవలను గుర్తిస్తూ.. వీరికి నోబెల్ బహుమతి సంయుక్తంగా ప్రదానం చేయాలని రాయల్ స్వీడిష్ అకాడమీ నిర్ణయించింది. మరోవైపు.. దక్కింది. ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం మరియా కొరినా మచాడో చేసిన కృషికి ఈ నోబెల్ బహుమతి ఆమెకు వరించింది. ఇక నోబెల్ శాంతి బహుమతి కోసం గంపెడు ఆశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చుక్కెదురైంది. స్వీడన్‌కు చెందిన సైంటిస్ట్, ఇంజినీర్‌, బిజినెస్‌మెన్‌గా ఫేమస్ అయిన ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 10వ తేదీన ఈ నోబెల్ బహుమతులు గెలుచుకున్న వారికి పురస్కారాలు అందిస్తారు. ఇక ఆ రోజు జరగనున్న వేడుకల్లో నోబెల్ విజేతలుగా నిలిచిన వారికి బహుమతితో పాటు.. 10 లక్షల డాలర్లు అంటే మన భారత కరెన్సీలో సుమారు రూ.8.8 కోట్ల నగదు అందించనున్నారు. ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ 1896లో మరణించగా.. 1901 నుంచి నోబెల్ ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు.