ఏపీలో వ్యవహారం సంచలనం రేపింది. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో కల్తీ మద్యం తయారీ కేంద్రం బయటపడటం కలకలం రేపింది. ఆ తర్వాత తీగలాగితే డొంక కదిలినట్లుగా దీని వెనుక ఉన్న నిందితులు ఒక్కొక్కరుగా బయటపడ్డారు. ప్రధాన అయ్యారు. ఈ వ్యవహారం ఇలా ఉండగానే.. ఎన్టీఆర్ జిల్లా దొరకడం కలకలం రేపింది. ములకలచెరువు కల్తీ మద్యం కేసు విచారణలో భాగంగానే ఈ బాగోతం కూడా వెలుగుచూసింది. దీంతో మందుబాబులో గుండె దడ పెరిగింది. ఈ నేపథ్యంలోనే తీసుకునివచ్చింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ యాప్ ప్రారంభమైంది. ఉండవల్లిలోని నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ యాప్ సాయంతో నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించవచ్చని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం నుంచి కల్తీ మద్యం రాష్ట్రానికి వారసత్వ సంపదగా వచ్చిందంటూ చంద్రబాబు మండిపడ్డారు. కల్తీ మద్యం గురించి అనేక వార్తలు వెలుగులోకి వస్తున్నాయన్న చంద్రబాబు.. ప్రస్తుతం దీనిపై మాట్లాడదలచుకోలేదన్నారు. నకిలీ మద్యంపై విచారణకు సిట్‌ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సిట్‌ బృందంతో నకిలీ మద్యం మొత్తం ప్రక్షాళన చేస్తామన్నారు. జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందంలో.. రాహుల్‌దేవ్‌ శర్మ, కె.చక్రవర్తి, మలికా గార్గ్‌ సభ్యులుగా ఉన్నారు. కల్తీ మద్యం కేసులో రాజీ లేదన్న చంద్రబాబు., మొత్తం ప్రక్షాళన చేస్తామన్నారు. బెల్ట్‌ షాపుల్లో అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్.. ఎలా పనిచేస్తుందంటే..నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించేందుకు ఈ ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ ఉపయోగపడుతుంది. మద్యం బాటిల్ మీద ఉన్న క్యూఆర్ కోడ్‌ను ఈ యాప్ ద్వార్ స్కాన్ చేస్తే.. ఆ బాటిల్‌కు సంబంధించిన వివరాలు తెలిసేలా ఈ యాప్ డిజైన్ చేశారు. అలాగే ఆ మద్యం బాటిల్ ఎక్కడ అమ్ముతారో అక్కడే జియో ట్యాగింగ్ అవుతుంది. ఇంకో చోట అమ్మే అవకాశం ఉండదు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మద్యం తయారీ కేంద్రం, బ్యాచ్, తేదీ ఇలాంటి వివరాలన్నీ కనిపిస్తాయి. గూగుల్ ప్లే స్టోర్‌లో ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ అందుబాటులో ఉంచారు. పూర్తిగా యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా ఈ యాప్ డిజైన్ చేశారు. కావాల్సిన వారు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.