ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలకు తీపికబురు చెప్పింది. ప్రధాన, మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సేవలు వేగంగా అందించేందుకు 5జీ మొబైల్స్ అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 58,402 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, సూపర్‌వైజర్లకు సామ్‌సంగ్ కంపెనీకి చెందిన ఈ సెల్‌ఫోన్‌లను ఏపీటీఎస్‌ ద్వారా కొనుగోలు చేశారు. ఒక్కో మొబైల్ ధర రూ.12,500. మొత్తం రూ.74 కోట్లు ఖర్చు చేశారు. ఇవాళ విజయవాడలో ఈ పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు.. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా వీటిని పంపిణీ చేస్తారు. ఈ మొబైల్స్ ద్వారా తమ సేవలను మరింత సమర్థవంతంగా అందిస్తారని చెబుతున్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయడానికి, ప్రభుత్వ పథకాలను వారికి చేరవేయడానికి ఈ మొబైల్స్ ఉపయోగపడతాయి. దీనివల్ల ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ అవుతాయి. విజయవాడలో బుధవారం జరిగే కార్యక్రమంలో మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి ఈ మొబైల్స్ పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని కు ఈ ఫోన్లను పంపిణీ చేస్తారు.మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో సీఎం భేటీమరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వచ్చే 4 నెలల్లో చేపట్టాల్సిన ప్రణాళికపై రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) వృద్ధి రేటు పెంచేందుకు చర్చిస్తారు. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాల్లో సాధించిన ఆర్థిక ఫలితాలపై సమీక్షిస్తారు.డిప్యూటీ కలెక్టర్‌గా మైనేని సాకేత్‌సాయిమరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టెన్నిస్‌ ప్లేయర్, అర్జున అవార్డు గ్రహీత మైనేని సాకేత్‌ సాయిని డిప్యూటీ కలెక్టర్‌ (కేటగిరీ-2)గా నియమించింది. స్పోర్ట్స్ విభాగం కింద డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ కోటాలో ఆయనకు అవకాశం కల్పించింది. అయితే నియామక ఉత్తర్వులు జారీ అయిన 30 రోజుల్లోగా ఆయన విధుల్లో చేరాలని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సాకేత్ సాయిని సీసీఎల్‌ఏ దగ్గర రిపోర్టు చేయాలని పేర్కొన్నారు.