, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో చిత్రం 'అఖండ 2: తాండవం'. వీరి గత మూడు చిత్రాలు బ్లాక్‌బస్టర్‌లుగా నిలవడం, 'అఖండ'కి సీక్వెల్ కావడంతో అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 5న థియేటర్లలోకి రావాల్సిన ఈ పాన్ ఇండియా మూవీ.. ఒక వారం ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుండగా.. గురువారం రాత్రి ప్రీమియర్ షోలు పడ్డాయి. ఈ చిత్రానికి స్పెషల్ షోల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది? బాలయ్య - బోయపాటి కాంబో సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేసిందా లేదా? పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతుందా? అనేది ఇప్పుడు ట్విట్టర్ రివ్యూలో చూసి తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాల్లో 'అఖండ 2: తాండవం' సందడి మొదలైపోయింది. అత్యధిక థియేటర్లలో ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. 2 గంటల 45 నిమిషాల రన్ టైంతో వచ్చిన ఈ చిత్రానికి, ముందు నుంచి ఊహించినట్లుగానే నందమూరి అభిమానుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సినిమా హాళ్లన్నీ ఫ్యాన్స్ తో కిక్కిరిసిపోయాయి. 'జై బాలయ్య' స్లొగన్స్ తో మారుమోగిపోతున్నాయి.'అఖండ' ఎక్కడ ఎండ్ అయిందో, అక్కడి నుంచే 'అఖండ 2' ప్రారంభమైంది. పవర్‌ ఫుల్ ఇంట్రడక్షన్, బోయపాటి మార్క్ టైటిల్ కార్డుతో.. ఫస్ట్ పార్ట్ కి సంబంధించిన రీక్యాప్‌తో అఘోర అవతారంలో బాలయ్యని చూపిస్తూ కథలోకి తీసుకెళ్లారని తెలుస్తోంది. సినిమా మొదలైన 13 నిమిషాలకే థమన్ తాండవం మొదలైపోయిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.ఓవైపు అఘోరాగా, మరోవైపు మురళీ కృష్ణగా బాలయ్య ద్విపాత్రాభినయం అదిరిపోయిందని అంటున్నారు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ నెక్స్ట్ లెవల్ అని అభిమానుల ట్వీట్లు కనిపిస్తున్నాయి. ఫస్టాఫ్ లోనే 'జాజికాయ' పాట వస్తుందని, ఆ తర్వాత కథ కీలక మలుపు తీసుకుంటుందని చెబుతున్నారు. ఇప్పటి వరకూ చూసినదాన్ని బట్టి, సినిమా సెన్సేషన్ అనే మాట వినిపిస్తోంది.