ప్రజారోగ్యం పరంగా తీవ్ర ఆందోళనను పెంచుతోంది. సీతామఢీ జిల్లా ఆస్పత్రిలోని ఏఆర్‌టీ అధికారిక లెక్కల ప్రకారం.. ఆ జిల్లాలో ఇప్పటివరకు వీరిలో 400 మందికి పైగా చిన్నారులు ఉన్నారు. ఈ పిల్లలకు వారి తల్లిదండ్రుల నుంచే వైరస్ వ్యాప్తి చెందినట్లు డాక్టర్లు గుర్తించారు. ఈ చిన్నారుల తల్లి, లేదా తండ్రిలో ఎవరో ఒకరు లేదా ఇద్దరూ హెచ్‌ఐవీ పాజిటివ్‌గా ఉండటం వల్ల ప్రసవం చేపట్టారు. సీతామఢీ జిల్లాలోని ఈ ఒక్క కేంద్రంలోనే నెలకు 40 నుంచి 60 కొత్త ఎయిడ్స్ కేసులు నమోదు అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలా ఆ జిల్లాలో భారీగా హెచ్ఐవీ కేసులు నమోదు కావడానికి.. అనేక సామాజిక కారణాలు ఉన్నాయని.. వైద్య అధికారులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రజల్లో హెచ్‌ఐవీ వ్యాప్తి గురించి సరైన అవగాహన లేదని తెలిపారు. ఎప్పటికప్పుడు ఎయిడ్స్ అవగాహనా ప్రచారాలు నిర్వహించినా ఫలితం కనిపించడం లేదని పేర్కొన్నారు.సీతామఢీ జిల్లాలో హెచ్‌ఐవీపై ప్రజల్లో చాలా తక్కువగా అవగాహన ఉండటం.. మెడికల్ టెస్టులు లేకుండానే పెళ్లిళ్లు చేసుకోవడం.. ఉపాధి కోసం దేశంలోని వివిధ రాష్ట్రాలకు వలసలు వెళ్లడం, సామాజిక వివక్ష కారణంగా ఎయిడ్స్ టెస్ట్‌లు చేయించుకునేందుకు స్థానికులు వెనకడుగు వేయడం వంటి అనేక కారణాల వల్ల హెచ్ఐవీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని డాక్టర్లు గుర్తించారు. సీతామఢీ జిల్లాలోని ఏఆర్‌టీ సెంటర్‌లో ప్రతి నెల 40 నుంచి 60 కొత్త కేసులు నమోదు అవుతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు. ప్రస్తుతం దాదాపు 5 వేల మంది రోగులకు ఈ ఏఆర్‌టీ సెంటర్ మందులు అందిస్తోంది. ఈ పరిస్థితి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన డాక్టర్ హసీన్ అఖ్తర్.. సీతామఢీ ఇప్పుడు హై లోడ్ హెచ్‌ఐవీ కేంద్రంగా మారిందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.హెచ్ఐవీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. సీతామఢీ జిల్లా యంత్రాంగం ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. దీంతో ఈ ఏఆర్‌టీ కేంద్రం కొత్త కమ్యూనిటీ ఔట్‌రీచ్ కార్యక్రమాలను రూపొందిస్తోంది. స్థానికంగా ఉన్న గ్రామాల్లో హెచ్‌ఐవీ పరీక్షా కేంద్రాలను నిర్వహించేందుకు మెడికల్ టీమ్స్ సిద్ధం అవుతున్నాయి.సురక్షిత లైంగిక పద్ధతులు, కలుషితమైన సూదుల వినియోగం వల్ల కలిగే ప్రమాదాలు, క్రమం తప్పకుండా హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరాన్ని ప్రజల్లో పెంచడం అత్యంత కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజారోగ్య విద్య, నిరంతరం పరీక్షలు లేకపోతే సీతామఢీ జిల్లాలో ఈ పెరుగుతున్న ఈ ఎయిడ్స్ కేసులు రానున్న నెలల్లో మరింత తీవ్రం అయ్యే ప్రమాదం ఉందని అధికారులు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు.