ఇలాంటి లక్కు ఎవరికి వస్తుంది చెప్పండి.. ఆ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులకు సమానంగా ఓట్లు.. చివరకు..

Wait 5 sec.

తెలంగాణలో జరుగుతున్న కొన్నిచోట్ల తీవ్ర ఉత్కంఠను సృష్టిస్తున్నాయి. సమానంగా ఓట్లు పోలైన సందర్భాలలో.. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా లక్కీ డ్రా పద్ధతిని ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ డ్రా పద్ధతిలో విజేతలను నిర్ణయించడం ఓటర్లకు.. అభ్యర్థులకు కూడా ఒక కొత్త అనుభూతినిచ్చింది.సర్పంచ్‌గా ఇండ్ల రాజయ్య.. యాదాద్రి భువనగిరి జిల్లా , రాజాపేట మండలం, లక్ష్మక్కపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ఫలితం లక్కీ డ్రా ద్వారా నిర్ణయించారు. లక్ష్మక్కపల్లి గ్రామంలో పోలింగ్ అనంతరం జరిగిన ఓట్ల లెక్కింపులో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి ఇండ్ల రాజయ్యకు 148 ఓట్లు వచ్చాయి. సరిగ్గా అదే సంఖ్యలో.. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి వేముల సురేందర్ రెడ్డికి కూడా 148 ఓట్లు పోలయ్యాయి.ఇద్దరికీ సమాన సంఖ్యలో ఓట్లు రావడంతో.. ఎన్నికల అధికారులు నిబంధనల ప్రకారం లక్కీ డ్రాను నిర్వహించారు. ఈ డ్రాలో బీఆర్‌ఎస్ అభ్యర్థి ఇండ్ల రాజయ్యకు అదృష్టం వరించి.. సర్పంచ్‌గా విజయం సాధించినట్లు అధికారులు ధ్రువీకరించారు. దీనిపై బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.వరంగల్‌లో వార్డు ఫలితం కూడా డ్రాలోనే.. సర్పంచ్ స్థానమే కాకుండా.. వార్డు సభ్యుల ఎన్నికల్లో కూడా ఇలాంటి ఉత్కంఠే చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మండలంలోని అంబేడ్కర్ నగర్ 1వ వార్డు ఫలితాన్ని కూడా చిట్టీల పద్ధతి ద్వారా నిర్ణయించారు.ఈ వార్డులో మొత్తం 101 ఓట్లకు 91 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన బొక్కల రజనికి 31 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి గోకల రూపకు కూడా సరిగ్గా 31 ఓట్లు పోలయ్యాయి. ఇద్దరు సమానం కావడంతో.. ఎన్నికల అధికారులు నిబంధనల ప్రకారం చిట్టీలు తీసి విజేతను ప్రకటించారు. ఈ డ్రాలో ఇండిపెండెంట్ అభ్యర్థి గోకల రూప విజేతగా నిలిచారు.ఈ లక్కీ డ్రా ఫలితాలు రుజువు చేశాయి. ఒక ఓటు కూడా వేయకుండా నిర్లక్ష్యం చేసిన ఓటర్ల నిర్ణయం పరోక్షంగా ‘అదృష్టం’పై ఆధారపడేలా చేసింది. అభ్యర్థులు ఎంత గట్టిగా పోరాడినా.. చివరికి విజయం మాత్రం చిట్టీ రూపంలో నిర్ణయించారు.. ఇది ఓటర్లకు తమ ప్రాతినిధ్య హక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదనే బలమైన సందేశాన్ని ఇస్తుంది.