కశ్మీర్‌లో దాడులకు లష్కరే, జైషే ఉగ్రవాదులు సంయుక్తంగా ప్లాన్.. సంచలన నివేదిక

Wait 5 sec.

జమ్మూ కశ్మీర్‌లో ఆందోళనకరస్థాయిలో పెరుగుతున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ సైన్యం చేపట్టిన ఆరు నెలల తర్వాత తాజాగా పాక్ ఉగ్రవాద సంస్థలు ముఖ్యంగా , జైషే మహమ్మద్‌లు సమన్వయ దాడులకు సిద్ధమవుతోన్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఉగ్రవాద సంస్థలు చొరబాట్లు, గూఢచర్యం, సరిహద్దు లాజిస్టిక్స్ కార్యకలాపాలను గణనీయంగా పెంచాయి. లష్కరే, జైషే ఉగ్రవాద సంస్థలకు చెందిన అనేక యూనిట్లు ఐఎస్ఐ, పాకిస్థాన్ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ (SSG) సహకారంతో ప్రవేశించినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి.ఈ నివేదిక ప్రకారం ఉగ్రవాది షంషేర్ నేతృత్వంలోని లష్కరే యూనిట్ డ్రోన్ల సాయంతో ఏరియల్ సర్వే నిర్వహించి, నియంత్రణ రేఖ వద్ద భద్రత బలహీంగా ఉండే ప్రాంతాలను గుర్తించింది. దీనిని రాబోయే వారాల్లో ఆత్మాహుతి తరహా దాడులు లేదా పేలుళ్లకు సూచనగా భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ వెంబడి ఎస్ఎస్జీ మాజీ సైనికులతో ఏర్పాటైన పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్‌లు, ఉగ్రవాదులు మళ్లీ శిబిరాలను ఏర్పాటుచేసుకోవడం సరిహద్దుల్లో దాడులకు సంకేతాలుగా భావిస్తున్నారు. ఇది ఆపరేషన్ సిందూర్ తర్వాత కశ్మీర్‌లో అలజడికి పాకిస్థాన్ కుట్రగా భావిస్తున్నారు.నిఘా వర్గాల నివేదికల ప్రకారం.. అక్టోబరులో పీఓకేలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో జమాతే ఇస్లామీ, హిజ్బుల్ ముజాహిద్దీన్, ఐఎస్ఐ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్లీపర్ సెల్‌ను మళ్లీ యాక్టివేట్ చేయడం, మాజీ కమాండర్లకు నెలవారీ స్టయిపెండ్లు, తీర్చుకోవాలని ఇందులో నిర్ణయించినట్టు నిఘా నివేదికలు పేర్కొన్నాయి. భారత భద్రతా దళాలు, రాజకీయ నాయకులపై ప్రతీకార దాడులు ఉద్ధృతం చేయాలని ఉగ్రవాదులకు ఐఎస్ఐ హ్యండర్లు సూచించారని తెలిపాయి. లష్కరే తొయిబా ఉగ్రవాదులు కశ్మీర్ లోయలో తమకు సహకరించే వ్యక్తులు, వనరులను గుర్తించే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ సహా తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్లతో చెల్లాచెదురైన తమ నెట్‌వర్క్‌లను తిరిగి పునరుద్దరించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సమాంతరంగా డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా కూడా విస్తరిస్తున్నట్టు గుర్తించారు. జమ్మూ కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకుంటోన్న తరుణంలో ఈ పరిణామాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీనిని ‘తీవ్రమైన హెచ్చరిక’గా పేర్కొంటూ ఆర్మీ, నిఘా వర్గాలు ఉత్తర కమాండ్ ప్రాంతాల్లో అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని ఓ అధికారి తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌లో పాక్ ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. అయినా పాక్ మరోసారి వక్రబుద్దిని ప్రదర్శిస్తే భారత సైన్యం ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుంది.