వరల్డ్‌కప్ విక్టరీ తర్వాత ఆనందలో స్టెప్పులేసిన జెమిమా రోడ్రిగ్స్.. ఢిల్లీలో డప్పులకు స్టెప్పులు అదుర్స్

Wait 5 sec.

భారత మహిళా జట్టు ప్రపంచ కప్ విజయం అనంతరం ఢిల్లీలో అడుగుపెట్టగానే సంబరాలు ఊపందుకున్నాయి. ప్రపంచ కప్ గెలుచుకున్న రెండు రోజులకే, నవంబర్ 4న ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్‌లో జరిగిన వేడుకల్లో తన సొంత స్టైల్లో అందరినీ మైమరపించింది. బ్యాట్‌ను పక్కనపెట్టి, ఈ సారి ఆమె భాంగ్రా స్టెప్పులతో అందరినీ అలరించింది. సారథ్యంలో భారత్ జట్టు నవి ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలిచి దేశానికి చారిత్రాత్మక మొదటి మహిళా వన్డే ప్రపంచ కప్ టైటిల్ అందించింది. ఆ విజయోత్సాహం ఢిల్లీకి చేరిన తర్వాత కూడా కొనసాగింది. ఢిల్లీలో ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ అందరూ ఒక ప్రత్యేకంగా సిద్ధం చేసిన కేక్ చుట్టూ చేరి సంబరాలు చేసుకున్నారు.కేక్ కట్ చేసిన వెంటనే అక్కడి వాతావరణం ఉత్సాహంగా మారిపోయింది. సంగీతం మొదలవగానే, జెమిమా రోడ్రిగ్స్, స్నేహ్ రాణా, రాధా యాదవ్ ముగ్గురూ కలిసి స్టెప్పులు వేశారు. వారి ఉత్సాహానికి జట్టు సభ్యులు చప్పట్లతో తోడయ్యారు, కోచ్‌లు, సిబ్బంది అందరూ ఆ క్షణాలను తమ ఫోన్లలో రికార్డ్ చేశారు. జెమిమా తన ప్రత్యేక ఎనర్జీతో ముందుండగా రాణా, రాధా ఆమెకు సరిగ్గా సరిపోయేలా స్టెప్పులు వేశారు. తీరా హోటల్ లాబీ మొత్తం డ్రెస్సింగ్ రూమ్ పార్టీలా మారిపోయింది.భారత జట్టు నవంబర్ 4న ఢిల్లీలో అడుగుపెట్టింది. నవంబర్ 2న జరిగిన ఫైనల్లో విజయం సాధించిన అనంతరం ఇది టీమిండియా మొదటి పబ్లిక్ అపియరెన్స్ కావడంతో అభిమానులు, మీడియా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. తాజ్ ప్యాలెస్ హోటల్ వద్ద ప్రారంభమైన ఆ వేడుకలో కేక్ కటింగ్ సెర్మనీ క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది.సెలబ్రేషన్స్ మధ్యలో కూడా జెమిమా రోడ్రిగ్స్ మాటలు ప్రతి భారత అభిమానికి గర్వకారణంగా నిలిచాయి. “ఈ జట్టు వేరుగా ఉంటుంది. ఇది సాధారణ జట్టు కాదు. ఎత్తుపల్లాలు ఎదురైనా, ఒక్కరినొకరు ప్రోత్సహించుకున్నాం. ఇదే అసలైన ఛాంపియన్ జట్టు లక్షణం” అని చెప్పింది.