రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం..

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్రంలో మారిపోయాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరానికి ఆనుకుని కొనసాగుతున్న తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (ఐఎండీ) హెచ్చరించింది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈ కొనసాగుతోంది. దీనికి తోడు.. రాష్ట్రంలో తక్కువ ఎత్తులో ఉత్తర, వాయువ్య దిశల నుండి గాలులు వీస్తున్నాయి. ఈ వాతావరణ పరిస్థితుల మొత్తం ప్రభావం కారణంగా.. రానున్న 12 గంటల్లో భారీ నుంచి వాతావరణ శాఖ తెలిపింది. నవంబర్ 5వ తేదీన రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ వర్షాల దృష్ట్యాజ. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నేడు (మంగళవారం) కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఊహించని విధంగా భారీ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఖమ్మం జిల్లా కారేపల్లిలో 7.0 సెం.మీ., నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దూర్‌లో 7.0 సెం.మీ., రంగారెడ్డి జిల్లా చుక్కాపూర్‌లో 6.5 సెం.మీ., వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌లో 6.4 సెం.మీ., నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెరలో 5.5 సెం.మీ., మరియు రంగారెడ్డి జిల్లా తొమ్మిదిరేకులలో 5.0 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. ఈ అకాల వర్షాల కారణంగా రైతాంగం తమ వ్యవసాయ ఉత్పత్తులను కాపాడుకోవడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, వరద వచ్చే అవకాశమున్న రహదారుల వైపు వెళ్లవద్దని సూచించారు.