తిరుమలలో ఆ ఫుడ్‌పై బ్యాన్.. భక్తులకు ఆ ఫుడ్ మాత్రమే, టీటీడీ కీలక నిర్ణయం

Wait 5 sec.

తిరుమలలోని దుకాణాల్లో భక్తులకు సాంప్రదాయ ఆహారాన్ని అందించేలా పటిష్టమైన ప్రణాళికను రూపొందించాలని టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన శ్రీ పద్మావతి అతిధి భవనంలోని సమావేశ మందిరంలో పలు శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. తిరుమలలోని దుకాణదారులు భక్తులకు నాణ్యమైన, రుచికరమైన సాంప్రదాయ ఆహారాన్ని అందించేలా స్థిరమైన విధానాన్ని అమలు చేయాలని అన్నారు.ను పూ‌ర్తిగా నియంత్రిస్తామని గతంలో టీటీడీ క్లారిటీ ఇచ్చింది. అదేవిధంగా తిరుమలలో పచ్చదనాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఔషధ వనాన్ని ఏర్పాటు చేయాలని అటవీ అధికారులను ఆదేశించారు. దాతలతో తిరుమలలోని ఉద్యానవనాలను సుందరీకరించాలని సూచించారు. అనంతరం ఆరోగ్య విభాగం,ఎఫ్ ఎం ఎస్ సేవలు, లోని వివిధ ప్రాంతాల్లో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఎల్ఈడి బోర్డులు, శ్రీ వారి సేవ, వైద్య, ఐటీ,కళ్యాణ కట్ట విభాగాల పనితీరు, తదితర అంశాలను కూడా సమీక్షించారు.తిరుచానూరు బ్రహ్మోత్సవాలుతిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల (నవంబర్ 17 నుండి 25వ తేదీ ) ఏర్పాట్లపై తిరుచానూరు ఆస్థాన మండపంలో మంగళవారం టీటీడీ జేఈవో వీరబ్రహ్మం సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై ఆయన తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణలతో కలిసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది కంటే ఈసారి భక్తులకు ఇంకా మెరుగైన విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలియజేశారు.పంచమీ తీర్థం రోజు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో తిరుచానూరుకు వచ్చే రోడ్లపై హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు . భక్తులకు ఇబ్బంది కలగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. హోల్డింగ్ ఏరియాస్, వాహన మార్గాలు, పుష్కరిణి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు టీటీడీ సీవీఎస్వో కేవీ మురళీకృష్ణ తెలిపారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. టీటీడీ చైర్మన్, ఈవోలు ఇచ్చిన సూచనల మేరకు బ్రహ్మోత్సవాలు మరింత ఘనంగా జరగే విధంగా ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు.తిరుపతి గోశాలలో టీటీడీ ఈవోతిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోశాలను మంగళవారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పరిశీలించారు. గోశాల నిర్వహణ, గోవులకు అందుతున్న దాణా, వసతి, వైద్యం, తాగునీరు, పరిశుభ్రత తదితర అంశాలను టీటీడీ ఈవోకు ఇంఛార్జీ డైరెక్టర్ డి. పణికుమార్ నాయుడు వివరించారు. దాదాపు 500 గోవులకు ఆధునిక వసతులతో నిర్మిస్తున్న సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ భవనాన్ని, గోశాలలో గోవులు, పేయ దూడలు ఉంటున్న షెడ్లను పరిశీలించారు. గోశాలలో పశువుల సంఖ్య, దాణా మిక్సింగ్ ప్లాంటు, అగరబత్తిల యూనిట్ వంటి కార్యాకలాపాలను ఈవో పరిశీలించారు. గోశాల, అగరబత్తిల యూనిట్ లోని సిబ్బందితో ఈవో మాట్లాడారు.