: వేలానికి ఫ్రాంఛైజీలు సిద్ధం అవుతున్నాయి. . ఇందులో భాగంగా ఫ్రాంఛైజీలు అన్నీ.. తమ రిటెన్షన్ లిస్ట్‌ను మరో వారం రోజుల్లో అంటే నవంబర్ 15 వరకు.. ఐపీఎల్‌కు అందజేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏ ఫ్రాంఛైజీ.. ఎవర్ని రిటైన్ చేసుకుంటుంది? ఎవరిని వదులుకుంటుంది? అనేది ఆసక్తిగా మారింది. ఈ పరిస్థితుల్లో గతేడాది ఛాంపియన్‌గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎవర్ని వదిలేసే అవకాశం ఉంది? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. కాలేదనే కామెంట్లు చేశారు. కానీ మాత్రం అదరగొట్టింది. ప్రతి ఒక్క ఆటగాడు.. తమ తమ పాత్రను సక్రమంగా నిర్వర్తించడంతో ఆ జట్టు.. తొలి టైటిల్ ముద్దాడింది. చాలా మంది ప్లేయర్లు మ్యాచ్ విన్నర్లుగా నిలిచారు. అయితే గతేడాది ఆ జట్టు తరఫున నిరాశపరిచిన వాళ్లలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్, యంగ్ పేసర్ రసిక్ సలామ్‌ దార్ ఉన్నారు. లివింగ్‌ స్టోన్‌ను ఆర్సీబీ రూ.8.75 కోట్లకు దక్కించుకుంది. కానీ అతడు గత సీజన్‌లో పెద్దగా రాణించలేదు. వరుసగా అవకాశాలు ఇచ్చినా.. చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. 10 మ్యాచ్‌లు ఆడిన అతడు.. 16 సగటుతో 112 రన్స్ మాత్రమే స్కోరు చేశాడు. అది కూడా 133 స్ట్రైక్‌రేట్‌తో. ఇక బౌలింగ్‌లో రెండు వికెట్లు తీశాడు. అతడిని ఆర్సీబీ విడుదల చేసే అవకాశం ఉంది.భారత్‌కు చెందిన రసిక్ సలామ్ దార్‌ను సైతం ఆర్సీబీ రూ.6 కోట్లకు దక్కించుకుంది. కానీ అతడికి పెద్దగా అవకాశాలు రాలేదు. వచ్చినప్పుడు కూడా అతడు సత్తాచాటలేదు. దీంతో అతడిని విడుదల చేసి.. మళ్లీ తక్కువ ధరకు సొంతం చేసుకోవాలని ఆర్సీబీ ప్రయత్నించే అవకాశం ఉంది. వీరితో పాటు లుంగీ ఎంగిడి (రూ.కోటి)ని కూడా ఆర్సీబీ విడుదల చేసే అవకాశం ఉంది.ఆర్సీబీ వేలంలో ఎవరి కోసం చూడొచ్చు..!*బ్యాకప్ స్పిన్నర్‌*మిడిల్ ఆర్డర్ ఆల్‌రౌండర్‌*భారత బ్యాకప్పేసర్‌ఐపీఎల్ 2025లో ఆర్సీబీ జట్టు..విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్ (కెప్టెన్‌), స్వస్తిక్ చికారా, దేవ్‌దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, మనోజ్ భండాగే, కృనాల్ పాండ్యా, లియామ్ లివింగ్ స్టోన్, జాకబ్ బెథెల్, రొమారియో షెఫర్డ్, స్వప్నిల్ సింగ్, మోహిత్ రాథీ, జితేశ్ శర్మ, ఫిలిప్ సాల్ట్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, నువాన్ తుషారా, లుంగీ ఎంగిడి, యశ్ దయాల్, రసిక్ దార్ సలామ్, సుయాశ్ శర్మ, అభినందన్ సింగ్‌