చైనా అమ్ములపొదిలో అత్యాధునిక ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్.. ప్రపంచంలోనే అతిపెద్ద నేవీ, అమెరికాకు ధీటుగా!

Wait 5 sec.

ఎదగాలనే లక్ష్యంలో భాగంగా.. అత్యంత అధునాతన విమాన వాహక నౌక 'ఫుజియాన్'ను అధికారికంగా ప్రారంభించింది. చైనా అధ్యక్షుడు .. ఈ యుద్ధనౌక రంగ ప్రవేశంతో.. చైనా రక్షణ సామర్థ్యాల్లో ఒక కీలక మైలురాయిగా చైనా ప్రభుత్వ మీడియా అభివర్ణించింది. ఈ ఫుజియాన్ యుద్ధనౌక అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో ఉపయోగించిన ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ కాటపుల్ట్‌లే కావడం విశేషం. ఈ అత్యాధునిక వ్యవస్థ.. నౌకపై నుంచి యుద్ధ విమానాలను అతి వేగంగా ప్రయోగించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు ప్రపంచంలో ఈ టెక్నాలజీ కలిగి ఉన్న ఏకైక దేశం అమెరికా మాత్రమే కావడం గమనార్హం.చైనా ప్రభుత్వ మీడియా నివేదికల ప్రకారం.. ఈ వ్యక్తిగతంగా జిన్‌పింగ్ నిర్ణయించడం విశేషం. చైనా వద్ద ఇప్పటికే రెండు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లు ఉన్నాయి. లియానింగ్, షాన్‌డాంగ్ అనే విమాన వాహకనౌకల కంటే ప్రస్తుతం కమిషనింగ్ అయిన ఫుజియాన్ చాలా శక్తివంతమైనదని చైనా మీడియా వెల్లడించింది. ఈ ఫుజియాన్ ఎక్కువ ఆయుధాలను, ఇంధన లోడ్‌తో కూడిన విమానాలను మోయగలదని పేర్కొంది. ఈ విమాన వాహకనౌక ద్వారా శత్రు లక్ష్యాలను మరింత ఎక్కువ దూరం నుంచే ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఛేదించగలవని తెలిపింది.చైనా స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన ఈ నౌక.. ఫ్లాట్ ఫ్లైట్ డెక్ కలిగి ఉంది. దీనికి మూడు వేర్వేరు రకాల విమానాలను ప్రయోగించగల సామర్థ్యం ఉంది. షీ జిన్‌పింగ్ నాయకత్వంలో చైనా తన నౌకాదళాన్ని అత్యం వేగంగా అభివృద్ధి చేస్తోంది. ఈ కొత్త నౌక సేవలు ప్రారంభించడం ద్వారా.. చైనా ఇప్పుడు మొత్తం నౌకల సంఖ్య పరంగా చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళాన్ని కలిగి ఉన్న దేశంగా నిలిచింది. చైనా చేస్తున్న ఈ వేగవంతమైన సైనిక విస్తరణ అమెరికా, దాని మిత్రదేశాలపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ ఫుజియాన్ కమిషనింగ్ వేడుక సందర్భంగా జిన్‌పింగ్ నౌక డెక్ అంతా పర్యటించి.. సైనికులతో మాట్లాడారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఇచ్చిన ఆదేశాలను అనుసరించి.. యుద్ధంలో గెలవడానికి పోరాడాలని సూచించారు.