జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీఆర్‌ఎస్ కంచుకోట బద్దలవుతుందా..? 2023 ఎన్నికలో ఏం జరిగింది..?

Wait 5 sec.

తెలంగాణలో రాజకీయ ఉత్కంఠ పెంచిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాల కోసం రాష్ట్రమంతా ఎదురుచూస్తోంది. మరికొన్ని గంటల్లో రానున్న ఫలితాలు, బీఆర్‌ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకుంటుందా.. లేక అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఇక్కడ పాగా వేస్తుందా అనే చర్చ జోరుగా సాగుతోంది. గా ఉన్నా.. జూబ్లీహిల్స్ వంటి అత్యంత కీలక నియోజకవర్గంలో అసలు గెలుపు గుర్రం ఏంటో అంచనా వేయడం అంత సులభం కాదు.ఈ ఉప ఎన్నిక ఫలితాన్ని అర్థం చేసుకోవాలంటే.. మొదట 2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికలు ఎలా జరిగాయి.. అప్పటి ప్రధాన అభ్యర్థుల విజయ పరంపరను విశ్లేషించుకోవాలి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంచనాలకు భిన్నంగా, అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇక్కడ త్రిముఖ పోరు నడిచినా.. ప్రధానంగా పోటీ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉంది. మాగంటి గోపీనాథ్ (బీఆర్‌ఎస్): సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ ఈ ఎన్నికల్లో విజేతగా నిలిచారు. నియోజకవర్గంలో బలమైన స్థానిక నాయకుడిగా.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఆయనకు ఉన్న పట్టు, బీఆర్‌ఎస్‌కు ఉన్న సంస్థాగత బలం, ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో ఉన్న నమ్మకం కలిసి వచ్చాయి. ఆయనకు దాదాపు 80,000కు పైగా ఓట్లు లభించాయి. 2014లో టీడీపీ నుంచి పోటీచేసిన గోపీనాథ్ విజయం సాధించారు. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరిన గోపీనాథ్.. 2018లో కూడా విజయం సాధించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సక్సెస్ సాధించి.. హ్యాట్రిక్ కొట్టాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో మరణించడంతో.. ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్‌ఎస్ పార్టీ తమ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి అయిన మాగంటి సునీతను 2025 జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బరిలోకి దించింది. గోపీనాథ్‌కు నియోజకవర్గంలో ఉన్న పట్టు, సానుభూతి ఓట్లు, బీఆర్‌ఎస్ కార్యకర్తల పట్టుదల సునీతకు కలిసి వస్తాయని బీఆర్‌ఎస్ గట్టి నమ్మకంతో ఉంది. మహమ్మద్ అజారుద్దీన్ (కాంగ్రెస్): భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అయిన అజారుద్దీన్, తెలంగాణలో పోటీ చేసిన ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆయనకు దాదాపు 64,212 ఓట్లు వచ్చాయి. ఆయన క్రికెట్ నేపథ్యం, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉన్నా.. స్థానిక రాజకీయాలపై పట్టు లేకపోవడం, నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ బలం ముందు నిలవలేకపోయారు. 2023లో ఓటమి పాలైనప్పటికీ.. పార్టీలో తన పాత్రను కొనసాగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. జూబ్లీహిల్స్ ఉప ఇచ్చారు. ఇక బీజేపీ తరఫున పోటీ చేసిన లంకుల దీపక్ రెడ్డి దాదాపు 25వేలకు పైగా ఓట్లు సాధించి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. 2023 ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్, అజారుద్దీన్‌పై 16 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించాడు. నవీన్ యాదవ్..ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున నిల్చున్న చాలా ఆసక్తికరంగా సాగింది. మొదట ఆయన మజ్లిస్‌ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి.. ఆ పార్టీలో అనేక హోదాల్లో పనిచేశాడు. 2014లో జూబ్లీహిల్స్‌ నుంచి ఎంఐఎం తరపున పోటీ చేశాడు. కానీ టీడీపీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో 9,000 పైగా ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆ తర్వాత 2018లో ఎంఐఎం టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. ఆ ఎన్నికల్లో 18,800 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు.2023 ఎన్నికల సమయంలో కూడా ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. అయితే ఆ తరువాత కాంగ్రెస్‌లో చేరమని మాజీ క్రికెటర్ ముహమ్మద్ అజహరుద్దీన్ సూచించడంతో నామినేషన్‌ను వెనక్కి తీసుకొని.. నవంబర్ 15న రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన "నవ యువ నిర్మాణ్" అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతూ యువతకు ఉపాధి శిక్షణ, ప్రోత్సాహం కల్పిస్తున్నాడు.ఇప్పుడు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్‌లో ఉపఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో నవీన్ యాదవ్‌ను కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థిగా అక్టోబర్ 8న ప్రకటించింది. దీంతో ఆయనకు మళ్లీ రాజకీయ రంగంలో కీలక అవకాశం లభించింది. ప్రస్తుతం ఈ ఎన్నికలో నవీన్ యాదవ్ గెలుపు నల్లేరు మీద నడకే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజక వర్గ ప్రజలు ఎవరికి పట్టం కట్టారు అనేది రేపు తెలవనుంది.లంకల దీపక్ రెడ్డి (బీజేపీ).. లంకల దీపక్ రెడ్డి రాజకీయాల్లోకి తెలుగుదేశం పార్టీ ద్వారానే వచ్చాడు. అక్కడ 25 ఏళ్లపాటు పనిచేస్తూ.. ఎన్నో బాధ్యతలు చేపట్టాడు. 2019లో టిడిపి నుంచి బయటకు వచ్చి.. భారతీయ జనతా పార్టీలో చేరాడు. బీజేపీలో కూడా క్రమంగా ఎదిగి, వివిధ హోదాల్లో సేవలు అందించాడు. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, 25,866 ఓట్లు సాధించి మూడవ స్థానంలో నిలిచాడు.తర్వాత ఆయన కృషిని గుర్తించిన పార్టీ.. 2025 ఫిబ్రవరిలో దీపక్ రెడ్డిని బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా నియమించింది. ప్రస్తుతం ఆయన ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో ఉపఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. అక్టోబర్ 15న బీజేపీ అధిష్ఠానం దీపక్ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఆయన మరోసారి ప్రజల నడుమ బీజేపీ తరఫున పోటీ చేశాడు.