శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుమలలో ఆ ఇబ్బంది తప్పినట్టే.. టీటీడీ ఈవో ఆదేశాలు

Wait 5 sec.

తిరుమల .సౌకర్యం కోసం ఉచిత బస్సులు నడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే భక్తుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఈ ఉచిత బస్సులలో రద్దీ పెరుగుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్.. టీటీడీ పరిపాలన భవనంలో అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. తిరుమలలో వివిధ ప్రాంతాలను సులువుగా గుర్తించేలా సూచిక బోర్డులను మరింత ఆకర్షిణీయంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. అలాగే శ్రీవారి భక్తులు తిరుమలలోని వివిధ ప్రాంతాలకు సకాలంలో చేరుకునేలా టీటీడీ ఏర్పాటుచేసిన ఉచిత బస్సుల సంఖ్యను పెంచాలని సూచించారు. ఘన వ్యర్థ పదార్థాలను వేగంగా తరలించాలని ఆదేశించారు. ఉత్సవాల సమయంలో ఆలయాల్లో సుందరీకరణ పనులను గార్డెన్ విభాగం, ఎలక్ట్రికల్ విభాగాలు సమన్వయంతో పూర్తి చేయాలన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో వివిధ రాష్ట్రాల కళా బృంధాలు శ్రీవారి భక్తులను ఆకట్టుకునేలా కళాప్రదర్శనలు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయా కళా బృందాలను అభినందిస్తూ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఉత్తరాలు రాయాలని టీటీడీ ఈవో సూచించారు. అలాగే కళాబృందాల ఫోటోలను కూడా పంపించాలన్నారు. అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే భక్తుల సౌలభ్యం కోసం సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. టీటీడీ ఉద్యోగులు నివసించే తిరుపతిలోని వినాయక నగర్ క్వార్టర్స్‌లో పెయింటింగ్స్, క్లీనింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా టీటీడీకి ఉన్న భూములకు సంబంధించిన మాస్టర్ డేటాబేస్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. కల్యాణ మండపాల నిర్వహణపైనా అధికారులు పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ఏజెన్సీ ఏరియాలలో ఆలయాలను నిర్మించాలని టీటీడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భూసేకరణకు సంబంధించి జిల్లాల కలెక్టర్లకు ఉత్తరాలు రాయాలని అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రాలలో శ్రీవారి ఆలయాల నిర్మాణాల కోసం ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఉత్తర ప్రత్యుత్తరాలను వేగవంతం చేయాలని సూచించారు. మరోవైపు అమరావతి, ఒంటిమిట్ట, తిరుచానూరు ఆలయాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ పైనా టీటీడీ ఈవో అధికారులతో చర్చించారు. ఆలయాలలో లైటింగ్, గ్రిల్స్ వంటి వాటి ఏర్పాటుపై సూచనలు చేశారు.