ముగిసిన ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియ.. ఆ ఫ్రాంచైజీ వద్ద డబ్బే డబ్బు.. ఎవరి వద్ద ఎంత పర్స్‌ మనీ ఉందంటే..

Wait 5 sec.

ఐపీఎల్ 2026కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 16న జరగనుంది. ఇందులో భాగంగా నెలరోజుల ముందే ఫ్రాంఛైజీలు ఆటగాళ్లు రిటెన్షన్ లిస్ట్‌ను విడుదల చేశాయి. శనివారం అంటే నవంబర్ 15వ తేదీన మొత్తం పది ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను రివీల్ చేశాయి. కొన్ని ఫ్రాంఛైజీలు భారీగా ప్రక్షాళన చేశాయి. ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌ ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్‌ను వదులుకుంది. అంతేకాకుండా గతేడాది రికార్డు ధర పలికిన వెంకటేశ్ అయ్యర్‌ను సైతం ఆ జట్టు విడుదల చేసింది.ఆండ్రీ రస్సెల్‌ ధర రూ.12 కోట్లుగా ఉంది. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర (రూ.23.75 కోట్లు) పలికిన వెంకటేశ్ అయ్యర్‌ను సైతం కోల్‌కతా నైట్ రైడర్స్ రిలీజ్ చేసి.. పర్స్‌ను భారీగా పెంచుకుంది. మినీ వేలానికి అత్యధిక పర్స్‌తో వెళ్తోంది. మిగతా జట్లు కూడా పలువురు కీలక ఆటగాళ్లను వదిలేసుకున్నాయి. మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టునుంచి అర్జున్ టెండూల్కర్ లక్నో సూపర్ జెయింట్స్‌కు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2026 వేలానికి ముందు ఫ్రాంఛైజీల పర్స్‌ ఎంతంటే..కోల్‌కతా నైట్ రైడర్స్‌ - రూ.64.3 కోట్లుచెన్నై సూపర్ కింగ్స్‌ - రూ.43.4 కోట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్‌ - రూ.25.5 కోట్లులక్నో సూపర్ జెయింట్స్ - రూ.22.95 కోట్లుఢిల్లీ క్యాపిటల్స్ - రూ.21.8 కోట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రూ.16.4 కోట్లురాజస్థాన్ రాయల్స్ - రూ.16.05 కోట్లుగుజరాత్ టైటాన్స్‌ - రూ.12.9 కోట్లుపంజాబ్ కింగ్స్ - రూ.11.5 కోట్లుముంబై ఇండియన్స్‌ - రూ.2.75 కోట్లు ఏ జట్టులో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే..కోల్‌కతా నైట్ రైడర్స్‌ (13), సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (10), చెన్నై సూపర్ కింగ్స్‌ (9), రాజస్థాన్ రాయల్స్‌ (9), ఢిల్లీ క్యాపిటల్స్‌ (8), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (8), లక్నో సూపర్ జెయింట్స్‌ (6), ముంబై ఇండియన్స్‌ (5), గుజరాత్ టైటాన్స్‌ (5), పంజాబ్ కింగ్స్‌ (4).