తెలంగాణలో చలి పులి పంజా.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు, జాగ్రత్తగా ఉండండి

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్రంలో గత .. తాజాగా వాటికి బ్రేక్ పడటంతో ఇప్పుడు రాష్ట్రంపై చలి పంజా విసరడం ప్రారంభించింది. శనివారం నుంచే రాష్ట్రంలో చలి ప్రారంభం కాగా.. నవంబర్ 10 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. రాబోయే రోజుల్లో రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.శనివారం రాత్రి నుంచే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం ప్రారంభించాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లా బేలలో 14.7 డిగ్రీల సెల్సియస్, రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో 14.7 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జహీరాబాద్‌లో 14.7 డిగ్రీల సెల్సియస్, శంకర్ పల్లి 14.9 డిగ్రీల సెల్సియస్, మొయినాబాద్ 15.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్‌లో రాజేంద్రనగర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UoH)లలో అత్యల్పంగా 15.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. బీహెచ్‌ఈఎల్ 15.5 డిగ్రీల సెల్సియస్ మల్కాజ్‌గిరి 15.7, గచ్చిబౌలి 15.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను నమోదు అయినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వాతావరణ కేంద్రం రాష్ట్రంలోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలోని మిగిలిన 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 12 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.ప్రజలు తీసుకోవాల్సిన తక్షణ జాగ్రత్తలురాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చలి నుంచి తమను తాము కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.చలిని తట్టుకునేందుకు స్వెటర్లు, జాకెట్లు, మఫ్లర్‌లు ధరించాలి. శరీరం మొత్తాన్ని కప్పి ఉంచే విధంగా దుస్తులు ధరించడం ఉత్తమం.శరీరంలో వేడిని ఉత్పత్తి చేసేందుకు వేడి వేడి సూప్‌లు, గోరువెచ్చని నీరు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.వృద్ధులు,చిన్నపిల్లలు అత్యవసరమైతే తప్ప ఉదయం త్వరగా, రాత్రి పొద్దుపోయిన తర్వాత బయటకు వెళ్లడం మానుకోవాలి.చలి వల్ల చర్మం పగలడం, పొడిబారడం జరగకుండా నాణ్యమైన మాయిశ్చరైజర్‌ను ఉపయోగించాలి.